నల్లబండగూడెం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
Guru paurṇami Celebrations:ప్రజా దీవెన, కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం (Nallabandagudem)గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో (Sai Baba Temple) గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు,అర్చనలు, హారతి నివేదన, తీరొక్క పూలతో అలంకరణ, పల్లకి సేవ, వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనుల పండువగ నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కోదాడ. మాజీ ఎంపీపీ మల్లెల. రాణి బ్రహ్మయ్య (Mallela rani Brahmayya), జడ్పిటిసి కృష్ణకుమారి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వామివారి వద్ద ప్రత్యేక పూజ (pooja)కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు నల్లపాటి. నరసింహారావు చేతుల మీదుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముండ్రా. రంగారావు, ఏదులాపురం. శ్రీనివాసరావు, ముండ్ర. రమేష్, శరభేశ్వరరావు, నారాయణ, సుందర్ రావు బొల్లు. రాంబాబు, ఆదినారాయణ, ఆలేటి. రాంబాబు,ముండ్రా. శ్రీను, గోపయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.