Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Command Control Center: కమాండ్ కంట్రోల్ ఇక డిజిపి ఆఫీస్

–అధికారుల కార్యాలయాలూ తరలింపు, అక్కడి నుంచే అన్ని విభాగాల కార్యకలాపాలు
–రేవంత్ ప్రభుత్వo కీలక నిర్ణయం

Command Control Center:ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైదరాబాద్ లక్డీకాపూల్‌లో (Lakdikapool) ఉన్న తెలంగా ణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు (Command Control Center)తర లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే నిర్ణయం తీసు కున్న ట్లు డీజీపీతో పాటు ఇతర కీలక అధికారుల కార్యాలయాలూ అక్క డికి మారనున్నాయి. ఐ3సీ నిర్మాణ సమయంలోనే డీజీపీతో (dgp)సహా అన్ని పోలీసు విభాగాలు, ఇతర కీలక ప్రభుత్వ విభాగాలు ఇక్కడి నుంచి పని చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌తోపాటు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో కొన సాగుతున్నాయి. డీజీపీ కార్యాల యం అక్కడికి మార్చడం వల్ల అన్ని కీలక విభాగాలు ఒకేచోట నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. కాగా, మొన్నటి వరకు ఏపీ సీఐడీ (apcid) ఆధీనంలో ఉన్న లక్డీకాపూల్‌లోని భవనం తెలంగాణ ఆధీనంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఐ3సీలో కొనసాగుతున్న సీపీ కార్యాలయంలో కొంత భాగం అక్కడికి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం (Traffic Control Room)భవనం పక్కనే మొన్నటి వరకు కొనసాగిన సీసీఎస్‌ కార్యాలయం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయానికి మార్చారు. అయితే ఇక్కడ అధికారులు, సిబ్బంది కూర్చుని రోజువారి విధు లు నిర్వహించేందుకు అనుకూలం గా గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని పాత బిల్డింగ్‌కు లేదా మరో భవనంలోకి మారుస్తారని సమాచారం. హైదరా బాద్‌ పోలీసులు ప్రత్యేక కేసుల విచారణ సమయంలో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించేం దుకు ఉపయోగిస్తున్న సిట్‌ కార్యాల యానికి పెద్ద మొత్తంలో అద్దె చెల్లి స్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఉప యోగించే కార్యాలయానికి అనవస రంగా అద్దె చెల్లించే బదులు సిట్‌ కార్యాలయాన్ని పోలీసు భవనాల్లో కి మార్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం మార్పలు చేర్పులు డిసెంబరు నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి మీటింగ్ లు ఇక్కడే. ..ఐ3సీ కేంద్రంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే పలు కీలక సమావేశాలు నిర్వహించారు. మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ఆయా విభాగాల అధికారులు ఈ సమా వేశాల్లో పాల్గొన్నారు. ఇకపై తరచూ ఇక్కడి నుంచే సమావేశాలు నిర్వ హించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీజీపీ, సీఎస్‌, ఇతర ముఖ్య అధికారుల కార్యా లయాలను ఇక్కడ ఏర్పాటు చేయ డం వల్ల సమావేశాలకు మరింత ఉపయోగకరంగా మారనుంది.