–మళ్ళీ బెయిల్ పిటిషన్ వాయిదా
–ఆగస్టు 5కు వాయిదా వేసిన కోర్టు
Kavitha:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Kavitha) డిఫాల్ట్ బెయిల్పై (Default bail)విచారణ మరోసారి వాయిదా పడిం ది. సోమవారం కవిత బెయిల్ పిటిష న్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు రాగా ఆగస్టు 5కు కోర్టు వాయిదా వేసింది. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందని జూలై 8న కవిత తర పు న్యాయవాదులు పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. సీబీఐ కవితను 2024 ఏప్రిల్ 11న అక్రమం గా అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు. జూన్ 7న సీబీఐ అసంపూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని కవిత తరపు న్యా యవాదులు కోర్టుకు వెల్లడించారు.
సీబీఐ చార్జ్షీటులో (CBI charge sheet)తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొంది.సీఆర్పీసీ167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని… ఏడు ఏళ్ళ శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉందని… తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 తేదీ నాటికి కవిత 86 రోజుల కస్టడీ పూర్తి అయ్యిందని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు. ఈరోజు మరోసారి పిటిషన్పై విచారణకు రాగా.. కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ (cbi , ed)… కవితను అదుపులోకి తీసుకున్నాయి. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనేక మార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం… అందుకు కోర్టు ధిక్కరచడం షరా మామూలుగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా కవిత జైలు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. తాజాగా కవిత తరపున లాయర్లు కీలకమైన అంశాన్ని బెయిల్ పిటిషన్లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన ఢిల్లీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. దీంతో మరికొంత కాలం కవిత (kavitha)జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.