*1.080 గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు ల స్వాధీనం
Chilkur Police:ప్రజా దీవెన , కోదాడ: గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అరెస్టు చేసిన చిల్కూరు పోలీసులు (Chilkur Police) ఈ సందర్భంగా సోమవారం కోదాడ డిఎస్పి కార్యాలయంలో(DSP office) నిర్వహించిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి మామిడి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండల పరిధిలోని బేతోలు గ్రామంలో గుండు గోపి, ఇంటి వద్ద గుండు రాజేష్, బత్తిని వెంకటేష్, కొలిమి శివ ,పేరం శ్రీకాంత్లు గంజాయి (ganjai)విక్రయిస్తున్నారని సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి ఐదుగురు వ్యక్తులను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 1.080 (ఒక కిలో 80 గ్రాములు) గంజాయిని నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు (case)నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ సిఐ రజితా రెడ్డి చిలుకూరు ఎస్సై రాంబాబు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కానిస్టేబుళ్లు నగేష్ వెంకటేశ్వర్లు తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు