— మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులేవని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ చేసిం దని, ఇప్పుడు బడ్జెట్లో అంకెల గారడీ చేసింది తప్ప ప్రజా సంక్షే మాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ హాల్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఆసరా పింఛన్లు (Supportive pensions)పెంచుతామ న్నా రు, బడ్జెట్లో మాత్రం నిధులు పెం చలేదన్నారు. ఆటో కార్మికులకు రూ.12 వేలు, రూ.4వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసేలేదు. కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదని విమర్శిం చారు. రూ.57వేల కోట్లు అప్పు తెస్తామంటున్నారు, ఇది మా ప్రభు త్వం కన్నా రూ.17వేల కోట్లు ఎక్కు వని, నెలకు రూ.7వేల కోట్ల వడ్డీ కడుతున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి (State Finance Minister)చెబుతున్నారు.
బడ్జెట్ (budget)కాపీలో మా త్రం వచ్చే ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ రూ.17,729 కోట్లని చూపిం చారని ఇందులో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ (demand)చేశారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం బడ్జెట్లో దానికి రూ.15,470కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో ఒకే సారి మాఫీ ఎలా సాధ్యమని హరీ శ్రావు ప్రశ్నించారు. ఆత్మస్తుతి, పర నిందతప్ప ప్రభుత్వ మొదటి బడ్జెట్ లో ఎలాంటి దశా దిశాలేదని ఆయ న విమర్శించారు.