Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gundala Mallesh: తెలంగాణ బడ్జెట్ లో కల్లుగీతకు అన్యాయం

–తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్

Gundala Mallesh:ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కల్లుగీత వృత్తిదారులకు కేవలం రూ. 68 కోట్లు కేటాయించడం అ న్యాయమని తెలంగాణ గౌడ సం క్షేమ సంఘం (Telangana Gowda Sam Kshema Sangam) రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుండాల మల్లేష్ అన్నారు. నీరాకు కేవలం రూ. 25 కోట్ల కేటా యిoపులు చేయడం బాధాకర మన్నారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో చ ర్చించి బడ్జెట్ ఎక్కువ కేటాయించే విధంగా నిధులు కేటాయించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

వృత్తిదారులకు సేఫ్టీ మెకులకు (Safety for professionals) అదేవిధంగా వృత్తి చేసుకుంటూ చనిపోయిన గీత కార్మికులకు, తాటి చెట్టు పై నుండి పడి గాయాలపాలు అయినటు వంటి కార్మికులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ సైకిల్ ఇస్తా అని చెప్పిందో మోటార్ వెహికల్ మం జూరు చేయుటకు బడ్జెట్ (Budget) కేటా యించాలని అన్నారు. కల్లుగీత వృత్తిదారుల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు రుణాలు గౌడ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం పునరాలోచించి గౌడు లకు బడ్జెట్ ఎక్కువ కేటాయిం చాలని డిమాండ్ చేశారు.