Olympic :ప్రజా దీవెన, కోదాడ: పారిస్ లో (Paris) శనివారం ప్రారంభం కానున్న ఒలంపిక్స్ (Olympic) 2024 క్రీడలలో భారత్ క్రీడాకారులు అన్ని రంగాలలో మంచి ఫలితాలు సాధించి భారతదేశానికి బంగారు పతకాలు సాధించాలని తేజ పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు అన్నారు. ఒలంపిక్స్ 2024 (Olympic) క్రీడలలో క్రీడాకారులందరికి ముందుగా ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటేందుకు పాఠశాల ఆవరణలో మార్చ్ ఫాస్ట్ చేస్తూ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఒలంపిక్స్ 2024 క్రీడలు 17 రోజులు జరుగుతాయని ఈ క్రీడలు భారత క్రీడాభిమానులకు సందడి మంచి అనుభూతిని అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి రాంబాబు సెక్రెటరీ వై సంతోష్ కుమార్ ఇన్చార్జులు రామ్మూర్తి ఝాన్సీ నవ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.