Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi: జల వనరుల సమర్థ వినియోగానికి రాష్ట్రాల్లో నదుల గ్రిడ్

–అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు అరాటపడండి
–రాష్ట్రాల సహకారంతోనే 2047 నాటికి వికసిత్‌ భారత్‌
–నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ

Narendra Modi:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జల వనరు ల సమర్థ వినియోగానికి నీతి ఆ యోగ్‌ వేదికగా ప్రధాని మోదీ (Narendra Modi) అ త్యంత కీలక సూచన చేశారు. ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్‌ ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నదీ జలాలపై (River waters)దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయి వివాదాలున్న నేపథ్యంలో ప్రధాని ఈ సూచన చేయడం గమనార్హం. శనివారం రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన 9వ నీతి ఆయోగ్‌ పాలక మండలి సమా వేశంలో ప్రధాని ప్రసంగించారు. అభి వృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడూ కలలు కంటు న్నాడని, ఇందులో రాష్ట్రాలు క్రియా శీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని.. సహకార సమాఖ్య విధానం ద్వారా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యా న్ని సాధించగలమని పేర్కొన్నారు.

విదేశీ పెట్టుబడులను (Foreign investment)ఆకర్షించేందు కు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పారు. శాంతి భద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు దీనికి అత్యంత కీలకమని వివరించారు. దేశంలో పేదరికం నిర్మూలనకు ప్రధాని (modi)పిలు పునిచ్చారు. గ్రామ స్థాయి వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి ఇదే ప్రాతిపదిక కావాలని దీనిని ఓ కార్యక్రమంలా కాకుండా వ్యక్తి కేంద్రంగా చేపడదా మని రాష్ట్రాలను కోరారు. పేదరి కాన్ని తగ్గించడం కాదు, పేదరికమే లేని దేశంగా మారేలా కృషి చేయాల న్నారు. కింది స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించినపుడే దేశంలో గొప్ప పరివర్తన జరుగుతుందని వ్యాఖ్యా నించారు.వివిధ రంగాల్లో ఏర్పడిన అవకాశాలను ఉపయోగించుకుని వినూత్న విధానాలను రూపొందిం చాలని మోదీ కోరారు. వాటిని అమలుచేసేలా కూడా చూడాలని అన్నారు. జనాభా నిర్వహణ ప్రణా ళికలను రూపొందించాలని కోరారు. వృద్దుల సంఖ్య పెరిగిపోవడాన్ని దృ ష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహ ణ ప్రణాళికలు రూపొందించాల న్నారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని పెంచా లని, ఇందుకోసం సామర్థ్య నిర్మాణ కమిషన్‌తో (Capacity Building Commission) కలిసి పనిచేయాలని రాష్ట్రాలకు నిర్దేశించారు. దేశం నిపుణులైన మానవ వనరుల కోసం ఎదురు చూస్తోందన్నారు.

వ్యవ సాయంలో ఉత్పాదకత పెరగాలి. రైతులకు మార్కెట్‌తో (Market for farmers) అనుసంధా నం కల్పించాలి. తక్కువ వ్యయం తో వెంటనే ఫలితాలు సాధించేలా చూడాలి. నేల సారం పెరిగే సహజ పద్ధతులను పాటించాలి. పంట ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెట్‌ లభించేలా చూడాలని కోరా రు. పెట్టుబడులకు అనుకూల వాతా వరణాన్ని కల్పించాలని రాష్ట్రాలను కోరిన ప్రధాని అవసరమైన విధా నాన్ని రూపొందించాలని నీతి ఆ యోగ్‌ను ఆదేశించారు. ఇందులో పెట్టుబడులకు అవసరమైన ప్రణా ళికలు ఉండాలని నిర్దేశించారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఆకాంక్ష పూరిత జిల్లాల కార్యక్రమాన్ని మోదీ ప్రశంసించారు. జిల్లాల మధ్య మెరు గైన పనితీరు కోసం పోటీ ఏర్ప డేందుకు వీలుగా నిరంతరం ఆన్‌లై న్‌ పర్యవేక్షణతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. గత పదేళ్లుగా భారత దేశం స్థిరంగా అభివృద్ది చెందుతోందని, పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. ప్రభు త్వం, ప్రజలు సమష్టిగా పనిచేసి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేయాలని లక్ష్యం పెట్టు కున్నారని చెప్పారు. నీతి ఆయోగ్‌ (NITI Aayog) సమావేశానికి 26 రాష్ట్రాల సీఎం లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెం ట్‌ గవర్నర్లు హాజరయ్యారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని రాష్ట్రాలు తమ వ్యూహాలను సమర్పించాయి. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అసెం బ్లీ సమావేశాల కారణంగా నీతి ఆయోగ్‌ భేటీకి హాజరుకాలేదు

మమత వాక్ అవుట్…

కేంద్ర బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానం టూ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత (CM Mamata) మధ్యలోనే వాకౌట్‌ చేశారు. తాను మాట్లాడుతుండగా మధ్యలోనే మైక్‌ ఆపివేయడాన్ని నిరసిస్తూ బాయ్‌కాట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్ర బాబుకు 20 నిమిషాలు, గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్‌ (Goa, Assam, Chhattisgarh)సీఎంలకు 15 నిమిషాల వరకు కేటాయించా రని తనకు మాత్రం 5నిమిషాలకే మైక్‌ బంద్‌ చేశారని మమత ఆక్షే పించారు. బడ్జెట్‌లో తమ రాష్ట్రాని కి నిధుల కేటాయింపు గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిం చారు. ఇది అవమానకరమని ఇంకెపుడూ నీతి ఆయోగ్‌ భేటీకి రానని ప్రకటించారు. ఆ వెంటనే కోల్‌కతాకు వెళ్లిపోయారు. ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వ డంపై తనకు అభ్యంతరం లేదని.. బెంగాల్‌ పట్ల వివక్ష చూపడం మా త్రం సహించబోనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి నీతి ఆయో గ్‌కు హాజరైన ఏకైక సీఎం తానేనని, కనీసం 30 నిమిషాల సమయం ఇవ్వాల్సిందని అన్నారు. కానీ, పదే పదే బెల్‌ నొక్కారని, ఇది అవమా నించడం కాదా అని ప్రశ్నించారు.

కాగా, ఇకపై అయినా నీతి ఆయోగ్‌ (NITI Aayog) కు ఆర్థిక అధికారాలు కల్పించాలని లేదంటే ప్రణాళికా సంఘాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. మమత నిర్ణయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ సమర్థించారు. కాగా, నీతి ఆయోగ్‌ సమావేశంలో 5 నిమిషాలే కేటాయించారన్న మమత ఆరోప ణలను నిర్మలా సీతారామన్‌ ఖం డించారు. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ కూడా మమత ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. ఆమెకు కేటాయించిన సమయం అయిపోయినట్లు మా త్రమే గడియారం చూపిందని వివ రించింది. నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రమణియన్‌ స్పందిస్తూ ప్రతి సీఎంకు 7 నిమిషాల సమయం ఇచ్చామని చెప్పారు. అక్షర క్రమంలో తొలుత ఏపీకి మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. ఆ లెక్కన మమత ప్రసంగం భోజన విరామం తర్వాత ఉందని, ఆమె కోల్‌కతా వెళ్లాలని చెప్పడంతో ముందుకు జరిపామన్నారు.