Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

car accident: లోయల్లో కారు ప్రమాదం

–ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృత్యువాత

car accident:ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: లోతైన లోయల్లో కారు (Car in deep valleys)ప‌డి ఒకే కుటుం బానికి చెందిన 8మంది మృతిచెం దిన విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) చోటు చేసుకుంది. జమ్మూకశ్మీ ర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రజలందరూ కిష్త్వార్ నివాసితులు.

సమాచారం ప్రకారం బాధిత కుటుంబం కిష్త్వార్ నుండి సింథాన్ టాప్ మీదుగా మార్వా వైపు వెళుతోంది. ఈ క్రమంలో వాళ్ళు ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన ఇంతియాజ్ వృత్తిరీత్యా పోలీసు (police). దీంతో పాటు ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు కారులో ఉన్నారు. దీం తో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు ఇంతియాజ్, అతని భార్య అఫ్రో జాగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు (Family members) అప్పగించ నున్నారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద తీరుపై విచారణ చేపట్టనున్నారు.