Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : లక్షణంగా లక్షన్నర రుణమాఫీ ఎల్లుoడే…

--రైతుల పట్ల నిబద్ధత చాటుకుం టూ రుణమాఫీ ద్వారా ఆదుకోవాల న్నదే కాంగ్రెస్‌ సంకల్పం --విదేశాల నుంచి రాగానే విస్పష్టం గా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం --అధికారం కోల్పోయిన ఆందోళన నుంచి తండ్రీకొడుకులు బయటపడ ని వైనం --2014లో జైపాల్‌రెడ్డిని సీఎం అ భ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌  గెలపు అప్పట్లో ఖాయం --పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్‌ చేయించ డంలో ఆయన పాత్ర సుస్పష్టం --రూ.10 కోట్లతో కల్వకుర్తికి నైపు ణ్యాభివృద్ధి కేంద్రం --కల్వకుర్తిలో జైపాల్‌ విగ్రహావిష్కర ణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్వేగ ప్రసంగం

లక్షణంగా లక్షన్నర రుణమాఫీ ఎల్లుoడే..!

–రైతుల పట్ల నిబద్ధత చాటుకుం టూ రుణమాఫీ ద్వారా ఆదుకోవాల న్నదే కాంగ్రెస్‌ సంకల్పం
–విదేశాల నుంచి రాగానే విస్పష్టం గా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
–అధికారం కోల్పోయిన ఆందోళన నుంచి తండ్రీకొడుకులు బయటపడ ని వైనం
–2014లో జైపాల్‌రెడ్డిని సీఎం అ భ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌  గెలపు అప్పట్లో ఖాయం
–పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్‌ చేయించ డంలో ఆయన పాత్ర సుస్పష్టం
–రూ.10 కోట్లతో కల్వకుర్తికి నైపు ణ్యాభివృద్ధి కేంద్రం
–కల్వకుర్తిలో జైపాల్‌ విగ్రహావిష్కర ణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్వేగ ప్రసంగం

ప్రజా దీవెన, నాగర్‌కర్నూల్‌: తెలంగాణ రైతుల పట్ల తమ నిబ ద్దత చాటుకుoటున్న విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని సీఎం రేవం త్‌రెడ్డి ( CM revanth reddy) చెప్పా రు. ఈ నెలాఖరు అంటే రేపు, ఎల్లుండి లోగా రైతులకు లక్షణంగా లక్షన్నర రుణాలను మాఫీ చేసి మరో మారు తమ నిబద్ధతను చాటు కుంటామని స్పష్టం చేశారు.  రైతులకు రుణమా ఫీ(Loan waiv er)  చేసి, వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పమని పేర్కొన్నా రు. పదేళ్ల పాలనలో తెలంగాణ ( telangana) ను తెగనమ్ముకు న్న ఒక సన్నాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాల్‌ విసిరా డని తాము జూలైలోనే రూ.లక్ష రుణమాఫీ చేసి రూ. 6 వేల కోట్లను రైతుల ఖా తాల్లో జమచేశామని గుర్తు చేశారు.

అధికారం కోల్పోయామన్న ఆందోళన తండ్రీకొడుకులను ఇంకా వది లిపెట్టినట్టు లేదని ఎద్దేవా చేశారు. 201 4 ఎన్నికల కంటే ముందు సూదిని జైపాల్‌రెడ్డి (suudini jaipal reddy) ని సీఎంగా ప్రక టించి ఉంటే కాంగ్రెస్‌కు అప్పట్లోనే అధి కారం ఖాయమయ్యేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి, దివం గత నేత సూదిని జై పాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ (naa gar karnool) జిల్లా కల్వకు ర్తిలో సీఎం రేవంత్‌ ఆయనకు ఘనం గా నివాళులర్పించారు. కొట్ర గేటు వద్ద ఏర్పాటు చేసిన జైపాల్‌రె డ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కల్వకుర్తిలో ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లా డారు.ఈ నెల 31లోగా రూ.లక్షన్నర రుణం నుంచి రైతులకు ( formers) విముక్తికల్పిం చబోతున్నా మని పునరుద్ఘాటించారు. వచ్చేనెల ఆగస్టు 2 నుంచి 14 వ తేదీ వరకు తాను విదేశీ పర్యటనలో ఉంటానని, వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణాలన్నీ సైతం మాఫీ చేస్తామని చెప్పారు.

*జైపాల్ రెడ్డి లాంటి వ్యక్తిత్వాలు అరుదు…*  రాజకీయాల్లో సూది ని జైపాల్‌రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తి త్వాలు చాలా అరుదుగా ఉం టాయని సీఎం చెప్పారు. నిజాయతీ గల నేతగా జైపాల్‌రెడ్డి తెలుగు జాతికే వన్నె తెచ్చారన్నారు. రాజకీయ నేతలకు జైపాల్‌రెడ్డి దార్శని కుడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయ నది కీలక పాత్ర అని తెలిపారు. పార్లమెంట్‌ (parlment) లో తెలం గాణ బిల్లును కొన్ని పక్షాలు వ్యతిరే కించిన సంద ర్భంలో మూడాఫ్‌ ద హౌస్‌( mood of the house) ప్రకారం బిల్లు పాసయ్యేలా చేయొచ్చని అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ను ఒప్పించారని తెలిపారు.

పార్ల మెంటు తలుపులు మూసివేసి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం నిలిపి వేసి, తెలంగాణ బిల్లు పాసయ్యేలా చేయ డంలో జైపాల్‌రెడ్డి ప్రమే యం ఎంతో ఉందని చెప్పారు. అనేక ఒడుదొడు కులను ఎదుర్కొని, రాజకీయంగా జరిగే నష్టాల గురించి అంచనాలు న్నప్పటికీ తెలంగా ణ రాష్ట్రం ఇవ్వ డంలో సోనియాగాంధీ( soniya gandhi) చూపి న చొరవ తెలం గాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల్లో అధికారం ద క్కకపోవడానికి ఓ తప్పిదమే కారణమన్నారు. ఎన్ని కల కంటే ముం దే జైపాల్‌రెడ్డిని సీఎం ( CM) అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్ర రాజ కీయాలు మరోలా ఉండేవన్నారు.

తెలంగాణకు జైపాల్‌రెడ్డే తొలి ముఖ్యమంత్రి అయ్యేవారని రేవంత్‌ చెప్పారు. ఆ ఒక్క తప్పిదం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని తెగన మ్ముకు నే పరిస్థితి కేసీఆర్‌ ( kcr) కుటుంబానికి దక్కిందన్నారు. అధికారం కోల్పోయామనే బాధ కేసీ ఆర్‌, కేటీఆర్‌ ( ktr) కు ఇంకా తగ్గలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాడని, నేను, నా బావనే అధికార పక్షం అడిగే వాటికి సమాధానం చెబుతామని కేటీఆర్‌ చెప్పాడు. కానీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు 11 గంటలకే కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రత్యక్ష మయ్యారని రేవంత్‌ అన్నారు. తండ్రీకొడుకుల మధ్యనే సమన్వ యం లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో మేడిగడ్డ ( medugadda) ను సందర్శించి కేటీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

*ఆమనగల్‌లో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌…* … హైదరాబా ద్‌, కల్వకుర్తి మధ్య రహదారిని నాలుగు వరసలుగా విస్తరించను న్నట్లు సీఎం రేవంత్‌ చెప్పారు. శ్రీశై లం (srishailam) వెళ్లే భక్తుల రద్దీ పెరిగినందు న ఈ రహదారిలో తర చూ ప్రమాదాలు జరుగుతున్నా యన్నారు. మూడు లేన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై తాను, మంత్రి కోమటి వెంకటరెడ్డి ( minister komatir eddy venkatreddy) కేంద్ర మంత్రి గడ్కరీ ( gadgari) ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇక కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్‌ మండ లంలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంట ర్‌ను (skill development cen tre) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

*నాయకులు కార్యకర్తలను గెలి పించుకునే బాధ్యత మాదే..*
నాయకుల ఎన్నికలు ముగిశాయని, కార్యకర్తల ను గెలిపించుకునే స్థాని క సంస్థల ఎన్నికలు వస్తు న్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. కష్టకాలం లో కాంగ్రెస్‌ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన కార్యకర్తలను కచ్చితం గా గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. పుట్టిన గడ్డకు తొలిసారి వచ్చిన సీఎం కల్వకుర్తి ( kalwaku rthi) పై వరాల జల్లు కురిపించారు. రూ.10 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెం ట్‌ సెంటర్‌ను మంజూరు చేశారు. ఆగస్టు 1 నుంచి పనులు ప్రారంభ మవుతాయని చెప్పారు. తాను చదువుకు న్న కల్వకుర్తి మండలం లోని తాండ్రా పాఠశాలకు రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. విగ్రహా విష్కరణ సభకు హాజరైన మంత్రి దామోదర రాజనర సింహ( minister daamodhara Rajanarsimha) మాట్లాడుతూ  జైపాల్‌రెడ్డితో తమ కుటుం బాని కున్న అనుబంధాన్ని గుర్తు చేసు కున్నారు. రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. 2014లో జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి ము ఖ్యమంత్రి అవ్వాల్సి ఉందని, ఆ లోటును ఇప్పుడు రేవంత్‌రెడ్డి భర్తీ చేశారని చెప్పారు. నల్లమల బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం శుభప్రదమని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానిం చారు.
*వృత్తి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు* .. వృత్తి నైపుణ్య యూని వర్సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి ( rangareddy) జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట వద్ద గుర్తిం చిన స్థలాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆది వారం సాయంత్రం పరిశీలించారు. ఇక్కడ సర్వే నం బరు 112లోని 57 ఎకరాల ప్రభు త్వ భూమిని వర్సిటీ కోసం అధికారులు గుర్తించారు. భూ ముల పటాన్ని ( lands map) పరి శీలించిన సీఎం, ఉన్నతా ధికారు లకు పలు సూచనలు చేశారు. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టు కొని యువతకు ఉపాధి కల్పించా లన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయను న్న ఈ వర్సిటీకి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. వర్సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (కొంగర కలాన్‌) వరకు 200 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి అవ సరమయ్యే భూములను గుర్తిం చాలని అధికారులను ఆదేశిం చారు. ఇందుకు నిధులు వెంటనే విడుదల చేయాలని సూచించారు. కాగా ఈ ప్రాంతంలో ఫార్మా ( formaa), నాన్‌ ఫార్మా పరిశ్రమల ఏర్పా టుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచిం చారు.

CM Revanth Reddy