Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KOMATIREDDY Vs JAGADISH REDDY: మంత్రి, మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం

–అసెంబ్లీలో విద్యుత్ రంగ చ‌ర్చ‌లో జ‌గ‌దీష్, మంత్రి కోమ‌టిరెడ్డి ల మా టల తూటాలు
–వ్య‌క్తిగ‌త విష‌యాలతో ఒక‌రిపై ఒక‌రు పరస్పర విమ‌ర్శ‌ల పర్వం
–కాంగ్రెస్ చ‌లువ‌తోనే తెలంగాణ‌ కు 24 గంట‌ల విద్యుత్ అన్న మంత్రి కోమటిరెడ్డి
–కెసిఆర్ సార‌ధ్యంలోనే ఆ ఘ‌న‌త‌ అని గర్జించిన జగదీశ్ రెడ్డి
— విద్యుత్ కొన‌గోళ్ల‌లో కేసిఆర్ చేతివాటం, విద్యుత్ మంత్రికి హ‌స్తమని వెంకట్ రెడ్డి ఆరోపణ
–నిరూపిస్తే రాజ‌కీయాల‌కు దూరం జరుగుతానన్న జ‌గ‌దీష్ రెడ్డి
–ముందుంది ముస‌ళ్ల పండ‌గంటూ మంత్రి కోమటిరెడ్డి చురకలు

KOMATIREDDY Vs JAGADISH REDDY: ప్రజా దీవెన,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ చర్చ రసాభాసగా మారింది. నల్లగొండ జిల్లా కు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (KOMATIREDDY), మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ల (JAGADISH REDDY)మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యు త్ రంగ చ‌ర్చ‌లో మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి, మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయి లో కొనసాగింది. అస‌ లు కంటే వ్య‌క్తిగ‌త విష‌యాల‌పైనే ఇద్ద‌రు ఫోక‌స్ చేసుకున్నారు. అసెం బ్లీలో విద్యుత్ పైచర్చ సందర్భంగా ఈ మధ్య మాటల తూటాలు పేలా యి. సవాళ్లు ,ప్రతిసవాళ్లు విసురు కున్న సందర్భంలో జగదీష్ రెడ్డిపై కోమటరెడ్డి విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి (JAGADISH REDDY)నల్గొండలో క్రిమినల్ రికా ర్డ్ (Criminal record) ఉందని ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించకపో తే తన ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసి రారు కోమటిరెడ్డి. తనపై ఆరోపణ లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు జగదీష్ రెడ్డి. కోమటి రెడ్డి సవాల్ ను స్వీకరిస్తు న్నానని చెప్పారు జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో కోమటిరెడ్డి వ్యాఖ్య లు ఇలా సాగాయి ..జగదీశ్ రెడ్డి జీవితమంతా కిరాయి హత్యలు, దొంగతనాలు అంటూ మండిప‌డ్డా రు మంత్రి కోమటిరెడ్డి. జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగార న్నారు. జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోప ణలు నిరూపిస్తాన‌ని స‌వాల్ చేశా రు. ఆరోపణలు నిరూపించకుంటే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనా మా చేస్తానని నిండు స‌భ‌లో మంత్రి ప్ర‌క‌టించారు. సూర్యపేట రైస్ మిల్లు లో జగదీష్ రెడ్డి దొంగతనం చేశారం టూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. రాం రెడ్డి హత్యకేసులో ఏ6 , ఓ హత్యకే సులో ఏ2 నిందితుడు జగదీశ్ రెడ్డి అంటూ చిట్టా విప్పారు.నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డ్ ఉం డంటంతో మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించార‌న్నారు మంత్రి కోమటిరెడ్డి (KOMATIREDDY).

నిరూపించి చూపించు రాజీనామా చేస్తా… జ‌గ‌దీష్ రెడ్డి

కాగా జ‌గ‌దీశ్ రెడ్డి (JAGADISH REDDY) సీఎం, మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. తాను హ‌త్య కేసుల్లో నిందితుడిన‌ని నిరూ పిస్తే ఇదే స‌భ‌లో ముక్కు నేల‌కు రాసి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుం టాన‌ని జ‌గ‌దీశ్ రెడ్డి (JAGADISH REDDY) స్ప‌ష్టం చేశా రు.రేవంత్ రెడ్డి (revanth reddy) ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నారో మ‌ళ్లీ అక్క‌డికే వెళ్లాల‌ని అనుకుం టున్నారని కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌కు కూడా చంచ‌ల్‌గూడ జైలు జీవితం గుర్తుందని అంటూ తెలంగాణ ఉద్య‌మం కోసం జైలుకు పోయాన‌ న్నారు. ఆయ‌న‌కు చ‌ర్ల‌ప‌ల్లినే గుర్తు ఉంట‌ది మ‌ళ్లీ యాది చేసుకంటు న్నార‌ని అన్నారు. సీఎం రేవంత్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌ల చేసిన‌ ప్ర‌తి అక్ష‌రం రికార్డుల నుంచి తొల‌గించాలి అని జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను చాలెంజ్ వేస్తున్నా కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడిన‌ దాంట్లో ఒక్క‌టి నిరూపించినా అందులో ఒక్క‌ టి రికార్డు చూయించినా నేను ఈ స‌భ‌లో ముక్కు నేల‌కు రాసి రాజీనామా చేసి పోతా రాజ‌కీ యాల్లో నుంచి వెళ్లిపోతా త‌ప్ప‌ని నిరూపించ‌క‌పోతే కోమ‌టిరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేల‌కు రాయాలి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను త‌న చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నాన‌ని జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.తాను ఎక్క‌డా త‌ప్పు మాట్లాడ‌లేద‌న్నారు జ‌గ‌దీష్ రెడ్డి. ఉపేక్షించం అని శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల‌ మంత్రి భ‌య‌పెట్టిస్తున్నారు. ఒక‌టి కాదు మూడు హ‌త్య కేసులు పెట్టారు త‌న‌పై అని పేర్కొన్నారు. ఈ మూడింటింలో కోర్టు నిర్దోషిగా తేల్చింద‌ని గుర్తు చేశారు. తె లంగాణ ఉద్య‌మం కేసులు త‌ప్ప.. వేరే కేసులు లేనే లేవని తేల్చి చెప్పా రు. ఒక్క కేసు నా మీద ఉన్న‌ పెట్రో ల్ బంక్ దొంగ‌త‌నం కేసు అని అన్నా రు. మిర్యాల‌గూడ కేసు మీద హౌస్ క‌మిటీ వేయండి, ఒక్క‌టి నిర్ధార‌ణ కాక‌పోయినా ముక్కు నేల‌కు రాసి రాజీనామా చేస్తాను. సీఎం, మంత్రి కూడా ముక్కునేల‌కు రాసి రాజీనా మా చేయాలి అని జ‌గ‌దీవ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆయ‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా (Opposition status)దండగ.. విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రె డ్డి విమర్శించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల నుంచి విద్యుత్‌ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సీఎంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు సరికాదన్నా రు, స‌భ‌కు రాని కెసిఆర్ కు విప‌క్ష హోదా దండగ అంటూ వ్యాఖ్యా నించారు.గత ప్రభుత్వ తప్పులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పై ఉందని, బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిం ది.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిం ది. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్‌ కేటాయించారు. కేసీఆర్‌ (kcr) సభకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. కేసీఆర్‌ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే.. కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి మాది కాదన్నారు. సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా, విద్యుత్‌ అవక తవకలపై కమిషన్‌ వేసి దర్యాప్తు చేస్తున్నాం. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ లాభదాయకం కాదని 2018లోనే చెప్పాను. ఈ ప్లాంట్‌ పూర్తయ్యేందు కు అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. డబ్బులు పోయినా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తికాలే దు. రామగుండంలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టం లో ఉంది. అక్కడ కాకుండా యాదా ద్రిలో ఎందుకు నిర్మించారని కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించా రు.