Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wayanad: వణుకులో వయనాడ్ మృత్యు ఘోష @ 133

–కాళరాత్రిలో ప్రకృతి ప్రకోపం,విరిగి పడిన కొండచరియలు, వరద బీభ త్సం
–65 కుటుంబాలు భూస్థాపితం, వందలాది మందికి గాయాలు శిథిలాల కింద ఇంకా 250 మంది
–చలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు శవాల దిబ్బగా చు రుల్మాల
–టీ-ఎస్టేట్లో 600 మంది అసోం, ప శ్చిమ బెంగాల్ కార్మికుల గల్లంతు –ఓ రిసార్ట్లో చిక్కుకున్న 100 మం ది మదర్సా, మసీదుల్లో వైద్య శిబి రాలు సహాయక చర్యల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్
–ఘోర విషాదాన్ని గతమెన్నడూ చూడలేదని కేరళ సీఎం పినరయి విచారం
–దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాహుల్, ఇతరులు

Wayanad:ప్రజా దీవెన, వయనాడ్: కేరళ (Kerala) కకావికలం అయ్యింది. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడింది. దే శంలోనే అటు కాశ్మీర్, ఇటు కేరళ అందమైన రాష్ట్రాలుగా ప్రాచుర్యం పొందిన విషయం విదితమే. అ యితే పశ్చిమ కనుమల నడుమ, తేనీటి తోటలు, ఏపుగా పెరిగే ర బ్బరు చెట్టు, చూపరులను ఆక ట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్ పై ప్రకృతి ప్రళ యం సృష్టించి, విపత్తు విరుచు కుపడింది. తెరిసినివ్వకుండా పరుస్తున్న వర్గాలు బురదతో కూ డిన వరద. విరిగిపడ్డ కొండ చరి యలు (A broken hillside). వెరసి సోమవారం అర్ధరాత్రి వయనాడు కాళరాత్రిగా మారింది. పదుల సంజ్ఞలో ఇళ్ళు కొండ చరి యల దాటికి నేలమట్టమయ్యాయి. నిద్రలోనే 188 మంది పౌరుల ప్రాణాలు తిరిగి రాని అనంతలో కాలకు చేరుకున్నాయి. మరో 128 నుంచి క్షతగాత్రులయ్యారు. కొండ చరియల బీభత్సం ఒకవైపు, వర దతో ఉప్పొంగిన నదులు మరో వై పు వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొ ట్టుకుపోతున్న మృతదేహాలు ఇం కోవైపు మృత్యుదేవత కరాళ నృ త్యం చేస్తోండా అన్నట్లు ఎక్కడ చూసినా మృతదేహాలు. హాహాకారాలు, ఆన్నతుల్లో బంధుమిత్రుల ఆర్తనా దాలు. ఈ విపత్తులో పందల మంది. గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం ఆం దోళన వ్యక్తం చేసింది. సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రం గంలోకి దిగాయి. ఎన్టీఆర్ఎస్, పారామిలటరీ, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీ తంగా యావత్ భారతం స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పిన రయి విజయన్ కు ఫోన్ చేసి, ధైర్యం చెప్పారు. కేరళ సర్కారు రెండ్రోజులపాటు సంతాపదినాలను ప్రకటించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Public Service Commission)(పీఎస్సీ) పరీక్ష బను వా యిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజులపాటు నాలుగు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను, కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. మరో వైపు భారత వాతావరణ శాఖ మరో రెండ్రోజులపాటు 8జిల్లాలకు రెడ్‌అలెర్ట్‌ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది.

అర్ధరాత్రి విరుచుకుపడ్డ కొండచరియలు (Landslides).. కేరళ వ్యాప్తం గా గత నాలుగైదు రోజులుగా ఎడ తెరిపిలేకుండా వర్షాలు కురుస్తు న్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌ (Wayanad) ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధ రాత్రి సరిగ్గా 1.30 సమయంలో వరద బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ముండక్కై గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. ఆ గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా ఆ ఇళ్లలో నివసిస్తున్న వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. వర్షం, వరద, దట్టమైన పొగమంచు కారణంగా.. సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకోవ డంలో ఆటంకాలేర్పడ్డాయి. మం గళవారం ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వైమానిక దళం హెలికాప్టర్లతో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నం చేశాయి. కేరళలో స్థానిక యువకులతో ఏర్పాటు చేసిన ‘సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌’ కూడా చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొం టోంది’’ అని కేరళ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ వి.సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వయనాడ్‌ ఘటన నేప థ్యంలో కేరళ సర్కారు తెలుగువా డైన సాంబశివరావును స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించింది. కాగా.. నౌకాదళం గజ ఈతగాళ్లను రంగం లోకి దింపగా ఎన్‌ డీఆర్‌ఎ ఫ్‌తో పాటు ఆర్మీ, టెరిటోరియల్‌ ఆర్మీ జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొ న్నారు. మధ్యాహ్నం శిథిలాలను తొలగించడం ప్రారంభించాక నిమిష నిమిషానికి గంట గంటకూ మృతదే హాలు బయటపడ్డాయి. మంగళవా రం రాత్రి కడపటి వార్తలందేసరికి 133 మంది మృతిచెందినట్లు అధి కారులు ప్రకటించారు. మరో 250 మంది వరకు శిథిలాల కిందే ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు ముండక్కై గ్రామానికి ఆను కుని ఉన్న చాలియార్‌ నదిలో 31 మృతదేహాలు కొట్టుకుని పోయా యి.

సహాయక శిబిరంపైనా బండరాళ్లు తొలుత తెల్లవా రుజా మున 3 గంటల సమయంలో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు (police) ముండక్కైలోని కొందరు స్థానికులను ఓ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలిం చారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ పాఠశా లపైనా కొండచరియలు విరిగిప డ్డాయి. ఆ స్కూల్‌ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు సైతం బురదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా కు రుస్తున్న వర్షం కారణంగా సహా యక చర్యలకు ఆటంకాలేర్పడు తున్నాయని, మంగళవారం మధ్యాహ్నం మరోమారు కొండ చరియలు విరిగిపడ్డాయని చెప్పా రు. ముండక్కై, మెప్పాడిలో వర దలో కొట్టుకుపోయిన వారిని గుర్తిం చేందుకు వైమానిక దళానికి చెంది న డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ, పోలీసులు శిథిలాల కింద జాగిలాలతో గాలింపు చేపట్టారు.

తాత్కాలిక ఆస్పత్రులు..

విపత్తు వేళ క్షతగాత్రులకు వైద్యం అందించడానికి అధికారులు చూ రాల్‌కొండలోని మదర్సాలు, మసీ దుల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పా టు చేశారు. వయనాడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో కూడా తాత్కాలిక ఆస్ప త్రి కొనసాగుతోందని అధికారులు చెప్పారు. వయనాడ్‌, కోళిక్కోడ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులతో మెప్పాడి, నీలంబూర్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కడపటి వార్తలందే సరికి 104 మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తయినట్లు ప్రకటించా రు.

అంతటా అప్రమత్తం…

రానున్న రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయం టూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జాబితాలో ఇడుక్కి నుంచి కాసర్గోడ్‌ మధ్యలో అన్ని జిల్లాలు ఉన్నాయి. శబరిమల ఉన్న పథనంతిట్ట, అలప్పుళ, కోటాయం, ఎర్నాకుళం జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌, తిరువనంతపురం, కొల్లాం జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ ప్రకటించింది. ఈదురు గాలుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పైకప్పులు బలంగా లేని ఇళ్లలో ఉండకూడదని పేర్కొన్నాయి. ప్రమాద బాధితుల కోసం కేరళ సర్కారు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. 1077, 1070 టోల్‌ఫ్రీ నంబర్లు, 9497900402, 0471–2721566 నంబర్లకు ఫోన్‌ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. రాత్రి కడపటి వార్తలందేసరికి త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 481 మందిని కాపాడినట్లు వివరించారు.

గతమెన్నడూ చూడని ఘోర విషాదం: పినరయి

కేరళలో ఎన్నడూ చూడనంతలా ఘోరమైన విషాదాన్ని వయనా డ్‌లో చూశామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరువనంత పురంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మంది ప్రా ణాలను కాపాడేందుకు ప్రయ త్నిస్తున్నామని వివరించారు. వయనాడ్‌ జిల్లాలో యుద్ధప్రా తిపదికన 45 పునరావాస కేంద్రా లను ఏర్పాటు చేశాం. అక్కడ 3,096 మందికి వసతి కల్పించాం. కేంద్రాల్లో ఆహారం, 20 వేల లీటర్ల తాగునీటిని అందుబాటులో పెట్టా మని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పి స్తున్నాను. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ, అమిత్‌షా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ నాకు ఫోన్‌ చేసి, సాయాన్ని ప్రకటించారు’’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా సీఎం సహాయ నిధికి విరా ళాలు ఇచ్చి, క్షతగాత్రుల కుటుం బాలను ఆదుకోవాలని పిలు పునిచ్చారు. కేరళకు చెందిన ఓ బ్యాంకు రూ.50 లక్షలు, తమిళ నాడు సీఎం రూ.5 కోట్లు, సియాల్‌ రూ.2కోట్ల చొప్పున సాయం ప్రకటించాయన్నారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వయనాడ్‌ దుర్ఘటనపై ప్రధాని మో దీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇ చ్చారు. ముఖ్యమంత్రి పినరయి విజయ న్‌కు ఫోన్‌ చేసి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు వివరించా రు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా రు.

విపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వయనాడ్‌ లోక్‌సభ స్థా నా నికి ప్రాతినిధ్యం వహించిన ఆయ న క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయన్‌తో, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లా డారు. కేంద్ర మంత్రులతో మాట్లా డి వయనాడ్‌కు అన్ని విధాలా సాయ మందేలా చర్యలు తీసుకుంటా మన్నారు. వయనాడ్‌ ఘటనపై లోక్‌సభలో అత్యవసర తీర్మానానికి కాంగ్రెస్‌ ఎంపీ వేణుగోపాల్‌ వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.