–వయనాడ్ విపత్తులో 270కి పెరిగిన మృతుల సంఖ్య
–240 మందికి పైగా గల్లంతు,
ఎక్కడ చూసినా శవాల గుట్టలు
–ఆప్తులను పోగొట్టుకున్న వారి అరణ్యరోదనలు
–భారీ వర్షాలతో మృతదేహాల వెలి కితీతకు అడ్డంకులు, బండరాళ్లతో మరిన్ని ఆటంకాలు
–వారం క్రితమే హెచ్చరించామన్న అమిత్ షా, అంతా అబద్ధమన్న కేరళ సీఎం పినరయ
Wayanad:ప్రజా దీవెన, వయనాడ్: వయనాడ్ (Wayanad) లో విపత్తు విలయతాండవం మర ణ మృదంగం సృష్టించింది. ఆనం దంతో గడుపుతున్న కుటుంబాలకు కుటుంబాలు మృత్యువాత పడిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. సోఫా లో కూర్చున్న ఐదుగురు కుటుంబ సభ్యులు, కొండచరియల దాటికి, అదే సోఫాలో విగతజీవులుగా మారిపోయిన హృదయ విదారక సంఘటన గుండెలను పిండేస్తుంది. భారీ వర్గం, చలిని తాళలేక రెండు మూడు బెడ్ షీట్లు కప్పుకొని పడు కున్నవారు, ఆ దుప్పట్ల కిందే మృత దేహాలుగా కనిపించడం, కొండచరి యలు వెళపెళా విరిగిపడుతున్న శబ్దాలు విని, బయటకు పరుగులు తీయాలనే ప్రయత్నంలో అదే భంగి మలో బురదలో కూరుకుపోయి విగత జీవులుగా మారిన సంఘ టనలు కోకొల్లలు.
ఇలాంటివి కొండచరియలు బీభత్సం (Landslides are a disaster)సృష్టిం చిన కేర ళలోని వయనాడ్ జిల్లా ముండక్కై, చురుల్మలలో సహాయక సిబ్బందికి కళ్ళకు కట్టినట్టు కనబడి న దృశ్యాలు. వయనాడ్ విషాదం లో మృతుల సంఖ్య 270కు పెరిగి నట్లు, మరో 240 మంది సమాచా రం ఇంకా గుర్తించాల్సి ఉందని స్ధా నిక ప్రసార మాధ్యమాలు పేర్కొం టున్నాయి.మృతుల సంఖ్య మరిం త పెరగవచ్చని పేర్కొంది. అయితే భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా సహాయక చర్యలను బు ధవారం మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేయాల్సి వచ్చిందని విపత్తు నివారణ అధికారులు వెల్లడించా రు. బుధవారం సాయంత్రానికి 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్త యినట్లు, వీరిలో 89 మందిని గుర్తించినట్లు అధికారులు పేర్కొ న్నారు. 148 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వయనాడ్ లో బురద ప్రవాహంలో చిక్కుకు పోయినవారిని రక్షించేందుకు, రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైన చోట బాధితులకు సహాయం అందించేం దుకు సహయక బృందాలు ఉక్కు తో నిర్మించే తాత్కాలిక వంతెనలను ఉపయోగిస్తున్నాయి.వరదలు సం భవించినప్పుడు ప్రాణనష్టాన్ని తగ్గిం చడంలో ఇవి చాలా కీలకంగా మా రాయి. ఈ వంతెనలను చిన్న, తేలి కైన వస్తువులతో వేగంగా నిర్మించ వచ్చు. వయనాడ్లో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తరలించారు. వీటికి బ్రిటన్ సివిల్ సర్వెంట్ డొనాల్డ్ బేలీ రూపకల్పన చేశారు. ఆయన పేరు మీదుగానే వీటికి బేలీ బ్రిడ్జి అని పేరు వచ్చింది. ఈ తరహా వంతెనలను బ్రిటిష్ సైనికులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉప యోగించారని సమాచారం.
కడు విషాద సంఘటనలు…
ఇదిలా ఉండగా బెంగళూరు నుంచి వయ నాడ్కు హనీమూన్ (Honeymoon) కోసమని వెళ్లిన రెండు జంటల్లో ఇద్దరు గల్లంత య్యారు. ఒడిశాకు చెందిన రెండు జంటలు వయనాడ్లోని ఓ రిసా ర్టులో బస చేశాయి. రాత్రి నిద్రలో ఉండగానే రిసార్టు నామరూపాలు లేకుండా కొట్టుకు పోయింది. ఒడిశా నుంచి బెంగళూ రుకు వచ్చిన రెండు జంటలు బెంగ ళూరులో ఓ కారు అద్దెకు తీసుకొని వయనాడ్ వెళ్లారు. ఆ కారును హావేరికి చెందిన డ్రైవర్ మంజునా థ్ నడిపారు. ఆ రాత్రి రిసార్టుకు 300 మీటర్ల దూరంలో మంజునాథ్ కారులోనే నిద్రించాడు. కారుకు జీపీ ఎస్ ఉండడంతో అక్కడి ప్రమాద కర పరిస్థితుల కారణంగా కారు యజమాని సచిన్కు మెసేజ్ చేరిం ది. అర్ధరాత్రి కారు ఆన్ కావడంతో డ్రైవర్ మంజునాథ్కు ఆయన ఫోన్ చేశారు. ‘మీరున్న ప్రాంతంలో ఏదో ప్రమాదం జరుగుతోందని అప్ర మత్తం చేశారు. రిసార్టు సమీపం లోనే చామరాజనగరకు చెందిన ఓ కుటుంబం నివసిస్తోందని, వారిని సంప్రదించాలని సూచించారు. మంజునాథ్ (Manjunath)అక్కడికి వెళ్లేలోగా సచిన్ చామరాజనగర్కు చెందిన నలుగురిని అప్రమత్తం చేశారు. దీంతో, ఆ ఇంట్లో ఉన్న అందరూ అర్ధరాత్రి బయటకు వచ్చి దూరంగా పరిగెత్తారు. ఆ తరువాత కాసేపటికే ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది.
ఎక్కడ చూసినా మృతదేహాల గుట్టలు..
బుధవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభమయ్యాక ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపించా యని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. చలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాల సంఖ్య 52గా ఉన్నట్లు వెల్లడించా యి. ముండక్కై, అట్టమల, చురుల్ మలలో 72 వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, వేర్వేరు ప్రాంతాల్లో 1000 మందిని కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నాయి. ‘‘ఆర్మీ శునకాలు మృ తదేహాలను గుర్తించడంలోకీలకంగా ఉపయోగపడుతున్నాయని తెలి పారు. అయితే, బురద, భారీ బండ రాళ్ల కారణంగా వాటిని వెలికితీయ లేకపోయాం. ఎక్స్కవేటర్లు వస్తే గానీ, బండరాళ్లను, కుప్పకూలిన కాంక్రీట్ దిబ్బలను తొలగించలేమ ని ఓ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. ముండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా వాటిల్లో 65 పూర్తిస్థాయిలో నేలమట్టమైనట్లు తెలిపారు. శిథిలాలను తొలగిస్తేగానీ లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియదని పేర్కొన్నారు. చురుల్ మలలో కూడా నదికి సమీపంలో ఉన్న ఇళ్లు నేలమట్టమైనట్లు వెల్ల డించారు. కాగా, వయనాడ్ ఘటన పై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్పందించింది. ఈ విప త్తుపై సుమోటోగా కేసును స్వీకరిం చింది. మరోవైపు, వయనాడ్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందంటూ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. హెచ్చ రికలు జారీ చేసినట్లుగానే కన్నడి పుళ, విలంగాడు, చురుల్మల ప్రాంతాల్లో మధ్యాహ్నం కొండచరి యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం జర గలేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రముఖుల వితరణ.. వయ నాడ్ విపత్తుపై ప్రముఖ వ్యాపారవే త్తలు స్పందించారు. సీఎంఆర్ఎ ఫ్కు రూ.5 కోట్ల చొప్పున విరాళా లు ఇస్తామని లులూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, రవి పిళ్లై, కల్యాణ్ జ్యువెల్లర్స్ యజమాని కల్యాణరామన్, విజింజం పోర్ట్ అదానీ గ్రూప్ ప్రకటించాయి. తమిళ నటుడు విక్రమ్ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఒమన్ సుల్తాన్ పాలకుడు సుల్తాన్ హైతం–బిన్–తారీఖ్ వయనాడ్ ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము కూడా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పో యిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదం గురించి ముందే హెచ్చరించాo.. కేరళలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదముం దని ముందే హెచ్చ రించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పార్లమెంట్లో వెల్లడిం చారు. ఈ ముప్పు గురించి జూలై 23నే అప్రమత్తం చేశామన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌ రులను సకాలంలో తరలించలేదు. వయనాడ్ విషాదాన్ని ఎదుర్కొ నేం దుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాస టగా నిలుస్తుందని ఆయన వ్యా ఖ్యానించారు. మరోవైపు వయనా డ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కోరారు. దీనిపై అమి త్షా స్పందించలేదు. మరోవైపు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వయనాడ్ బాధితు లకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాహుల్, ఆయన సోదరి ప్రియాంక వయనాడ్లో పర్యటించనున్నారు.
అంతా సుద్ద అబద్ధం: విజయన్
లోక్సభలో అమిత్షా చేసిన ప్రకటనను కేరళ సీఎం విజయన్ ఖండించారు. బుధవారం ఆయన తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున మాత్రమే రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. అమిత్షా చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. ఇది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సాయం కాదు. కేంద్ర ప్రభుత్వం వారం రోజుల నుంచి వయనాడ్కు ఆరెంజ్ అలెర్ట్ మాత్రమే జారీ చేసింది. కానీ, భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయానికి (గడిచిన 48 గంటల్లో) 57.4 సెంటీమీటర్ల వర్షపాతం నమో దైందని పినరయివ్యాఖ్యానించారు.