–సెక్యూరిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులు నిలబడే విధులపై స్పందించిన రేవంత్ రెడ్డి
–ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలో అమ లును పరిశీలిస్తున్నాం, త్వరలోనే శుభవార్త వినిపిస్తాం
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సెక్యూ రిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యో గులు, పోలీస్ హోంగార్డులకు సిట్ టు రైట్ (For Security Guards, Fourth Class Officers, Police Home Guards) కూర్చునే హక్కు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామ న్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల నిలబడి విధులు నిర్వహిస్తు న్నారని, ఈ విషయంలో వారికి ఉపశమనం కలిగేలా పని వేళలో వారికి కూర్చునే హక్కు కల్పించా లనే ప్రతిపాదనపై సభలో సీఎం స్పందిoచారు. ప్రస్తుతం ఈ విధానం దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు లో అమలు అవుతున్నందునా అక్కడ ఉన్న విధివిధానాలను పరి శీలించి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, సీఎం స్పందనతో లక్షలాది మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ (Fourth Class Employees) కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పని వేళ లో కనీసం కూర్చొవడానికి సైతం అనుమతి లేక కుటుంబ పోషణ కోసం గంటల తరబడి నిల్చోవాల్సి న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం గనుక సానుకూల నిర్ణయం తీసు కుంటే ఇంతకాలం పడుతున్న తమ బాధలకు విముక్తి కలుగుతుందనే సంతోషం ఈ తరగతి ఉద్యోగులలో వ్యక్తం అవుతున్నది.