ఎమ్మెల్యేను కలిసిన కోదాడ మున్సిపల్ పాలకవర్గం.
Kodada Municipality: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ (Kodada Municipality)అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ మున్సిపల్ చైర్మన్ సామినేని (Chairman Samineni). ప్రమీల, వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు కౌన్సిలర్లతో కలిసి హైదరాబాదులో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి (MLA Uttam Padmavathi)రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకవర్గం మాట్లాడుతూ పట్టణంలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు లేకపోవడంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రభుత్వ నుండి నిధులు మంజూరు చేయించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA) సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంధం. యాదగిరి, షాబుద్దీన్, శ్రీనివాస్ యాదవ్, తిప్పిరిశెట్టి సుశీల రాజు, కైలాస్వామి నాయక్, మేదర లలిత తదితరులు పాల్గొన్నారు.