–యుద్ధప్రాతిపదికన మురుగు శుద్ధికి ముమ్మర ప్రయత్నం
–జంట జలాశయాల ఎగువన 4 ఎస్టీపీల ఏర్పాటుకు నిర్ణయం
–రూ.65 కోట్ల వ్యయంతో 9 నెలల్లో పూర్తికానున్న నిర్మాణo
–వాటర్బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం
Waterboard HYD: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు (HYD) మహానగరానికి తాగునీటి నందించే జంట జలాశయాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సా గర్లలోకి (Himayatsagar and Osmansagar) చుక్క మురుగు నీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ రెండు జలాశయాల ఎగువ భాగాన పెద్ద ఎత్తున నిర్మా ణాలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా మురుగు వచ్చి చేరుతోన్న విషయం తెలిసిందే. మరో హుస్సే న్సాగర్గా మారకముందే మురు గును వేగంగా శుద్ధిచేసి వదిలేందు కు వాటర్బోర్డు చేసిన ప్రతిపాద న కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జంట జలాశయాల ఎగువ భాగం లో రూ.65 కోట్లతో నాలుగు మురు గునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మా ణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిం ది. పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది.
నెల రోజుల్లో టెండర్ (tender)ప్రక్రియను పూర్తి చేసి శంకు స్థాపన చేసేందుకు అడు గులేస్తోం ది.భారీగా నిర్మాణాలు, ఫామ్ హౌస్ లు జంట జలాశయాల ఎగువ ప్రాం తాల్లో పెద్దఎత్తున ఫామ్ హౌస్లు వెలిశాయి. పలు రిక్రియేషన్ సెంట ర్లు సైతం ఏర్పాటయ్యాయి. దీంతో పాటు ఆయా గ్రామాల నుంచి ము రుగునీరంతా ఉస్మాన్సాగర్, హి మాయత్సాగర్ లలో చేరుతోంది. దీన్ని అరికట్టకపోతే మున్ముందు జలాశయాల ఉనికికే ప్రమాదం ఉన్నందున ఎస్టీపీల నిర్మాణం చేప ట్టాలని జలమండలి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం లోని మణికొండ, సన్ సిటీ, పాత బస్తీ (Manikonda, Sun City, Old Basti)లోని పలు ప్రాంతాలకు ప్రతి నిత్యం ఉస్మాన్సాగర్ నుంచి 97 మిలియన్ లీటర్లు, హిమా యత్సా గర్ నుంచి 36 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నా రు.9 నెలల్లో నిర్మాణానికి నిర్ణయం 20 ఎంఎ ల్డీల సామర్థ్యం గల ఈ నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి రూ. 65 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పనులను ద క్కించుకునే సంస్థ వాటర్బోర్డుతో ఒప్పందం చేసుకున్న తర్వాత తొ మ్మిది నెలల్లో పనులు పూర్తి చేయా లని నిర్ణయించారు. ఇప్పటికే ఉస్మా న్సాగర్ ఎగువన జన్వాడ, హిమా యత్నగర్ ప్రాంతాల్లో, హిమాయత్ సాగర్ ఎగువన నాగిరెడ్డిగూడ, కా ముని నాలా సంగమం వద్ద అవస రమైన భూమిని సేకరించి నట్లు తెలి సింది. ఎస్టీపీలు నిర్మించే సంస్థయే రెండేళ్లపాటు పూర్తి నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుందని టెండర్ నిబంధనల్లో పొందుపరిచా రు.
మొత్తం 4 ఎస్టీపీల నిర్మాణా లకు చర్యలు…. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ (Osmansagar, Himayatsagar) ఎగువన నాలు గు ఎస్టీపీలను నిర్మించనున్నా రు. ఉస్మాన్సాగర్ ఎగువన 9 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామ ర్థ్యంతో రెండు ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 4 ఎంఎ ల్డీల సామర్థ్యంలో జన్వాడ వద్ద బుల్కాపూర్ నాలా సమీపంలో ఒక టి, చిలుకూరు జోన్ పరిధిలోని హిమాయత్నగర్ వద్ద 5 ఎంఎల్ డీల సామర్థ్యంతో మరొకటి నిర్మిం చనున్నారు. అలాగే హిమాయత్ సాగర్ ఎగువన 11 ఎంఎల్డీల సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మించనున్నారు. అజీజ్నగర్, బంగళ్గూడ, నాగిరెడ్డిగూడ జోన్ పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా నాగిరెడ్డిగూడ వద్ద 5ఎంఎల్డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించడానికి నిర్ణయించారు. అదే విధంగా మరో ఎస్టీపీని కోత్వాల్గూ డ, శంషాబాద్, కవాగూడ జోన్ల పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా కాముని నాలా సంగ మం వద్ద 6ఎంఎల్డీల సామర్థ్యం తో ఎస్టీపీని (STP) నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో హైదరా బాదు నగర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.