–జాతీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం
–క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తుస్తాం
–ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించింది
–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupalli Krishna Rao:ప్రజా దీవెన, మహబూబ్ నగర్: టూరిజం స్టడీ టూర్ (Tourism Study Tour) లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం సరళా సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి (Jupalli Krishna Rao)మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపం చ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉ న్నాయని అన్నారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక, వారసత్వ సంపదకు నెలవుగా ఉందని తెలిపారు. ఎన్నో అవకా శాలు, వనరులు ఉన్నప్పటికీ గడచి న పది సంవత్సరాల్లో గత బీఆర్ఎ స్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభి వృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నేతృ త్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఉమ్మడి పాల మూరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక ప్రాంతాలను (Tourist areas) ప్రాచుర్యంలోకి తీసుకురావడం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, తదితర అంశాలపై అధ్యాయనం చేస్తున్నామని వివరించారు. ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమెటిక్ సైఫాన్ సిస్టం కలిగిన సరళా సాగర్ తో పాటు కోయిల్ సాగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వంశీ కృ ష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘరెడ్డి, అనిరుధ్ రెడ్డి, సి డబ్ల్యూ సి మెంబర్ చల్లా వంశీచం ద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.