Smart Phones: ఇటీవల కాలంలో మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్లను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు యువతను ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లతో (super features) స్మార్ట్ ఫోన్లను మర్కెట్స్ లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నెలలో అధిక సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను ఆకర్షించనున్నాయి. వీటిల్లో కొన్ని ఫోన్లు ఇప్పటికే లాంచ్ కాగా మరికొన్ని ఫోన్లు లాంచ్కు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేయనున్న స్మార్ట్ ఫోన్లను మనం ఇప్పడు తెలుసుకుందాం…
భారతదేశంలో జూలై 30న రియల్మీ కంపెనీ మిడ్-రేంజ్ నంబర్ సిరీస్ ఫోన్ మార్కెట్లోకి (phone market)వచ్చింది. రియల్ మీ 13 సిరీస్ ఫోన్లను కేవలం మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసారు. రియల్ మీ 13 ఫోన్లు ప్రో, ప్రో ప్లస్ వేరియంట్స్లో రిలీజ్ చేసింది. అయితే రేట్ గురించి ప్రత్యేకంగా కంపెనీ పేర్కొనకపోయినప్పటికీ ఈ ఫోన్లు రూ.26 వేల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని నిపుణుల అంచనా.
ఇక ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కూడా తన వీ 40 సిరీస్ను ఈ నెలలోనే లాంచ్ అవ్వబోతుంది. ఈ నెల ఏడో తారీఖున వివో వీ 40, వీ 40 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రియులను అక్కటు కుంటుంది. ఈ ఫోన్ ‘ప్రో’ వెర్షన్లో జూమ్-ఇన్ పోర్ట్రెయిట్లను అందించడానికి 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది. ఐపీ 68 రేటింగ్తో వచ్చే ఈ ఫోన్లో 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ధర అయితే రూ.40 వేల నుంచి ఉంటుంది.
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9)సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న లాంచ్ చేయ బోతుంది. ఇక ఈ గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్టెల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కూడా ఉంటాయని తెలుపుతున్నారు. ఈ ఫోన్ టెన్సర్ జి4 చిప్ సెట్తో వచ్చే ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. ఏఐ ఫీచర్లతో వచ్చే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధర గురించి అధికారిక సమాచారం అందుబాటులో అయితే లేదు అనే చెప్పాలి.
ఆగస్టు 4న ఐక్యూ జెడ్9 ఎస్ (IQ Z9S) సిరీస్ ఫోన్లను ప్రకటించనున్నారు. ఐక్యూ జెడ్ 9 ఎస్, ఐక్యూ జెడ్ 9 ఎస్ ప్రో ఫోన్లు కర్వ్డ్ డిస్ ప్లేతో వస్తాయని టెక్ నిపుణులు అంచనా . స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్ సెట్తో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 20 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ (Nothing phone)ప్రియులు 2ఏ ఫోన్ను జూలై 31న రిలీజ్ చేయడం జరిగింది.ఈ మీడియా టెక్ డైమెన్సిటీ 7350 చిప్ సెట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫొటో ప్రియులను బాగా ఆకర్షించుకుంది. ఈ ఫోన్ ధర రూ.30 వేల కంటే తక్కువకే వస్తుందని టెక్ నిపుణులు (Tech experts) అంటున్నారు. మంచి ఫోన్ కొనాలి అనుకునే వారికీ ఇదే మంచి అవకాశాం అనే చెప్పలి.