–ప్రజలoదరి సమ్మతితోనే 370 రద్దు
–ఆర్టికల్ 370ని రద్దుకు ఐదేళ్ల సందర్భంగా ప్రధాని మోదీ
Prime Minister Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక మలుపు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించానని ఆయన తెలిపారు. ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ, కశ్మీర్, లఢఖ్లో (Jammu, Kashmir, Ladakh) కొత్త శకానికి నాంది అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఈ మేరకు కశ్మీర్ వాసులకు హామీ ఇస్తున్నా’ అని మోదీ (modi) తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ స్పందించారు. ఆర్టిక ల్ 370 రద్దుతో భద్రత, భరోసా, మె రుగైన అవకాశాలు ఇక్కడి యు వత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు చేరువయ్యా యని ఆయన పేర్కొన్నారు. అభివృ ద్ధి ఫలాలను అందుకోలేని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం నాడు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా మారిందని తెలిపారు. 2019, ఆగస్టు ఐదున మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని (Article 370) రద్దు చేసి జమ్మూ, కశ్మీరు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిం చిన సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు ఐదును కాంగ్రెస్, పీడీపీలు బ్లాక్ డేగా (Congress and PDP as a black day)పాటించాయి. జమ్మూ, కశ్మీర్ కు ప్రత్యేక హెూదా ఇవ్వాలని, రాష్ట్రంలో పూర్వస్థితిని తేవాలని డిమాండ్ (demnad(చేస్తూ ఈ పార్టీలు వేర్వే రుగా నిరసన ర్యాలీలు నిర్వహిం చాయి. ఆగస్టు 5 భారత ప్రజాస్వా మ్యానికి మాయని మచ్చ అని ముప్తి ధ్వజమెత్తారు.