–అల్పాహారం తర్వాత వాంతులు, తీవ్ర కడుపునొప్పి
–జడ్చర్ల మైనారిటీ గురుకుల పాఠ శాలలో విషాద సంఘటన
–విద్యార్థులకు ఆసుపత్రిలో కొనసాగుతోన్న చికిత్స
Food Poisoning: ప్రజా దీవెన, జడ్చర్ల: కలుషితాహా రం (Food Poisoning) తిని 49 మంది గురుకుల విద్యా ర్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో (With vomiting and stomachache)తీవ్ర అవస్థలతో బాధపడ్డారు. మహ బూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని మై నారిటీ బాలుర గురుకుల పాఠశా లలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఉండగా మెనూ ప్రకారం ఉదయం అల్పా హారంగా కిచిడీ, కట్టా (పచ్చిపులు సు) వండి పెట్టారు. తిన్న తర్వాత విద్యార్థులు తరగతి గదులకు వెళ్లారు. సుమారు గంట తర్వాత మొదట 6వ తరగతి విద్యార్థి ఒకరు వాంతులు చేసుకున్నాడు. అనంత రం మరికొంత మంది విద్యార్థులు కడుపులో నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మొత్తం 49 మంది అస్వస్థతకు గుర య్యా రు.
ఉపాధ్యాయుల సమాచారంతో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్రెడ్డి (Deputy DMHO Dr. Sridhar Reddy), జడ్చర్ల పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ మనుప్రియ, ఆర్ బీఎస్కే వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ హరీశ్ తమ సిబ్బందితో పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు చికిత్స చేశారు. 9 మంది తీవ్ర అస్వస్థతకు (severe illness) గురికావడంతో 108 అంబులెన్స్లో జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి ఆరో గ్యం నిలకడగా ఉంది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలను పరిశీలించారు. ఆవరణ అపరి శుభ్రంగా ఉండడంతో ఉపాధ్యా యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వండిన అన్నం, కూర లను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుం టామన్నారు. పాఠశాలలోని మిగ తా విద్యార్థులకు భరోసా కల్పిం చేందుకు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వారితో కలిసి భోజనం చేశా రు. పాఠశాలను డీఎంహెచ్వో డా క్టర్ పద్మజ, జడ్పీ సీఈవో వెంకట్రె డ్డి, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు