–ప్రేమ వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
–సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన
suicide:ప్రజా దీవెన, సంగారెడ్డి: ఓ యువకుడి వేధింపులు (Harassment of youth)తాళలేక యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడి దల మండలం దోమడుగు గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దోమ డుగు గ్రామానికి చెందిన తేజేశ్వని బీఫార్మసీ చదువుతోంది. తనను ప్రేమించా లంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహి తులతో కలిసి తరచూ విద్యార్థినినీ, ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపై పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగలేదు, దీంతో ఏమీ తోచని పరిస్థితుల్లో ఆ యువతి తాను ఉంటున్న భవనం నాలుగు అంతస్తుల పై నుండి కిందకు దూకి ఈరోజు ఆత్మహత్య (suicide) చేసుకుంది.
వెంటనే కుటుంబ సభ్యులు( family members) చుట్టు పక్కల వారు యువతిని ఆసు పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యంలో తేజేశ్వని మృతి చెందింది. ఆత్మహత్యకు (committed suicide )గ్రామం లోని గంజాయ్ బ్యాచ్ కారణ మంటూ బంధువులు ఆందోళనకు దిగారు.నిందితులను ఉరితీయాలం టూ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.