New Parents Committee: ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నార్కట్పల్లి మండలంలోని చిన్న నారాయణపురం లో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టంగూర్ కు సంబంధిం చిన నూతన పేరెంట్స్ కమిటీని (New Parents Committee) శనివారం ఎన్నుకున్నారు. 5 వ తరగతి నుండి ఇంటర్ వరకు చదు వుతున్న విద్యార్థుల తల్లిదండ్రు లతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి నుండి ఇద్దరు చొప్పున మొత్తం 32 మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది.
అందులో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా కోక చంద్రశేఖర్ (Koka Chandrasekhar as the chairman of the committee), వైస్ చైర్మన్ గా బీపంగి సుమలత, ప్రధాన కార్యదర్శి కొమ్ము యాదగిరి, సహాయ కార్యదర్శి సైదులు, కోశాధికారి పోకల కరుణాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రుద్రవరం దశరథ లతోపాటు 26 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకో వడం జరిగింది. నేటి నుండి రెండు సంవత్సరాల వరకు ఈ కమిటీ పని చేస్తుంది.. ఈ సందర్భంగా నూతన కమిటీ బాధ్యులకు పాఠశాల ప్రధా నోపాధ్యాయురాలు శమంతకమణి అభినందనలు తెలిపారు. అలాగే పాఠశాల కాంప్లెక్స్ లో ఉన్న పలు సమస్యల గురించి కమిటీకి విన్న వించింది. విద్యార్థుల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి పాఠ శాల సిబ్బందితో (School staff)కలిసి పాలకవర్గ సభ్యులు పనిచేయాల్సి ఉంటుం దన్నారు.ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయులు సాజియా బేగం, కృష్ణవేణి ఉన్నారు.