Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Commissioner Ranganath: అక్రమాలపై రంగనాథ్ రంగప్రవేశం

–కొనసాగుతోన్న ఆక్రమణల కూల్చివేతలు

Commissioner Ranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు (Hyderabad) పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ (Commissioner Ranganath)రంగప్రవేశం చేశారు. రంగ ప్రవేశం చేసిందే తడవుగా ఉక్కు పాదం మోపడం మొదలుపెట్టారు. తాజాగా చందా నగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేస్తున్నారు. వైశాలినగర్ లోని ఎఫ్ టి ఎల్ ల్యాం డ్ లో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా భారీ బిల్డింగ్ (Hydra is a huge building) లను జెసిబిలతో నేలమట్టం చేస్తోంది.

శనివారం ఉదయం మొదలైన కూల్చివేతలు ఆదివారం సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు.కాగా దా దాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూమ్రుఖుద్దీన్‌ దవాళ్‌ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్‌ జోన్ల (Buffer zones)లో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాదాపు 10 ఎకరాల చెరువు భూ మిని కబ్జా చేసినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారు లు మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మా ణాలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబిన్‌ (MLA Mubin) కూల్చివేతలను నిలిపివేయాలని హైడ్రా సిబ్బందిని అడ్డుకోగా, పోలీ సులు అరెస్టు చేసి స్టేషన్‌కు తర లించారు.

చెరువులు ఆక్రమిస్తే చెరశా లే… ట్రై సిటీ పరిధిలో చెరువు లకు సంబంధించిన బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రియల్టర్లు, బిల్డ ర్ల నిర్మాణాలు అక్రమమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఆక్ర మణదారులకు సహకరించే అధికా రులపై కూడా చర్యలుంటాయి. చెరువులు, కుంటల సమీపంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే ముం దు ఓ సారి హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదని సూచిం చారు.