నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య
ప్రజా దీవెన/మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో సంచలనం సృష్టించిoది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోపాల్ వాడలో నివాసం ఉండే శరణ్య (23) స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే, శరణ్య గురువారం సాయంత్రం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, ఎసీపీ తిరుపతి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.