Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CP Sudhir Babu: అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

–డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు
–హాష్ ఆయిల్ విక్రయించే ముఠా అరెస్ట్, 1.8 కోట్ల విలువైన నూనె స్వాధీనం
–చాకచక్యంగా వ్యవహరించి పట్టు కున్న హయత్ నగర్, ఎల్బీనగర్ బృందాలు
–వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి సుధీర్ బాబు

CP Sudhir Babu:ప్రజాదీవెన, రాచకొండ క్రైం బ్యూరో: గంజాయి నుంచి నూనె తయారీచేసి, అధికరేట్లకు విక్రయించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.8కోట్ల విలువైన 13.5 కేజీల హాష్ అయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ కార్యాయంలో(Rachakonda Commissionerate function) సీపీ సుధీర్ బాబు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను వివరాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీరామారాజు జిల్లా (Alluri Seeramaraj District) మాడుగుల మండలం అలగం గ్రామానికి చెందిన వంచుర్భా కొండబాబు, వంచుర్భా బాలకృష్ణ ఇద్దరూ అన్నదమ్ములు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ఇరువురూ సులభంగా డబ్బు సంపాదించాలని, గంజాయిని, అందులో నుంచి వచ్చే హాష్ అయిల్ ను తయారీ చేసి విక్రయించి సొమ్ము చేసుకోవాలని అన్నాకున్నారు.

ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా (Andhra Pradesh, Odisha)నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌ను రవాణా మార్గంగా ఎంచుకుని, బెంగళూరుకు తరలించేవారు. హాష్ ఆయిల్‌ను చౌక ధరకు కొనుగోలు చేసి, బెంగళూరులోని ఓ వ్యక్తికి 10రెట్ల అధఇక ధరకు విక్రయించారు. దీంతో వారు భారీ లాభాలను (Andhra Pradesh, Odisha) అర్జించారు. ఇటీవల, బెంగళూరు నుంచి ఓ వ్యక్తి 14 కిలోల హాష్ ఆయిల్ ను వారికి ఆర్డర్ చేశాడు. ఈ నెల 10న కొండ బాబు, బాలకృష్ణ తమ గ్రామానికి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న చడూరు మామిడి కొండలు వద్ద హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి, మరుసటి రోజు 11న సాయంత్రం పెద్దంబర్‌పేట్ గ్రామం తాజా ఫుడ్స్ హోటల్ (Foods Hotel) వద్ద బెంగళూరుకు చెందిన వ్యక్తికోసం వేచి ఉన్నారు.

అదే సమయంలో ఎస్వోటీ, ఎల్బీనగర్ జోన్ బృందం, హయత్ నగర్ పోలీసులతో (SOT, LB Nagar Zone Team, with Hayat Nagar Police)కలిసి వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.1.10కోట్ల విలువైన 13.5 కేజీల హషీష్ ఆయిల్, రూ.2వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, సుమారు 1 కేజీ బరువున్న ప్యాకింగ్ కవర్లును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారణ అనంతరం రిమాండ్ కు పంపినట్లు సీపీ తెలిపారు. కాగా, ఒక కేజీ హషీష్ ఆయిల్ తయారీకి సుమారుగా35నుంచి 40 కేజీల గంజాయిని అవసరం పడుతుంది.

మొత్తం 13.5 కేజీల హషీష్ ఆయిల్ సుమారు 560 కేజీల గంజాయిని వినియోగించారని విచారణలో తేలింది. గంజాయి మార్కెట్ రేటు ప్రకారం హషీష్ ఆయిల్ ధర దాదాపు రూ.14కోట్లు ఉంటుందని సీపీ (cp)తెలిపారు. ఎన్డీఎఫ్ చట్టంలోని సెక్షన్ 31ఏ ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలు, మాదకద్రవ్యాల సేకరణ, అమ్మకం, రవాణా, వినియోగం నేరమని, 10ఏండ్ల జైలు శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుందని ఆయన తెలిపారు. కాగా, నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.