మంత్రుల భౌద్ధ స్థూపం సందర్శన
— డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు పొంగులేటి, జూపల్లి లు
Bhatti Vikramarka: ప్రజా దీవెన, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచా లని, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొ చ్చి బుద్దిస్ట్లను ఇక్కడికి తీసు కురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)సూచించారు. సోమవారం పాలేరు నియోజ కవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి (Bhatti Vikramarka), ఎక్సైజ్, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి (Jupalli Krishna Rao, Revenue Minister Pongu Leti Srinivas Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బుద్దిస్టుల కార్య క్రమం ఏర్పాటు చేసి ఆహ్వానిం చాలని, వారి సూచనలు, సలహాలు తీసుకుని.. టూరిజం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు. దీనికి సంబంధించి నిధులు మంజూ రు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్కిలజీకల్ సైట్గా చేయాలని, పాత ఆరామా లను పునఃప్రారంభం చేయాలని, వసతులు, ప్రొటెక్షన్, ఏర్పాటు చేయాలన్నారు.టూరిజం, ఆర్కి యాలజీ ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేయాలని, బుద్దిస్టులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బౌద్ధ స్థూపం వద్ద పర్యాటక అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. బౌద్ధ స్థూపంను పర్యాట కులకు అందించేందుకు ఏం చేద్దాం ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారు, ముఖ్యమైన బౌద్ధ స్థూపం కు పూర్వ వైభవం తీసుకురావా లని, 8 ఎకరాలను అభివృద్ధి చేయాలని, స్థూపంకు లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తెలం గాణలో బౌద్ధ స్థలాలు ఉన్నాయని, మూడు స్థలాల్లో పాలేరు కీలకమై నదని అన్నారు. అయితే సిబ్బంది కొరత, బడ్జెట్ లేదని మంత్రులకు అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్తోనే ఖమ్మం జిల్లా అభి వృద్ధి: మంత్రి పోంగులేటి
దేశంలోనే నేలకొండపల్లి బౌద్ధ స్థూపంకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని, నేలకొండపల్లి బోద్దస్థూపం అండర్ గ్రౌండ్లో ఇంకా స్థూపాలున్నాయని మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి (poleti srinvasa reddy) అన్నారు. టూరిజంలో బెస్ట్ ప్లేస్గా నేలకొండపల్లిని తీర్చిదిద్దాలన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చాలన్నారు. పాలేరు నియోజక వర్గంలో రిజర్వాయర్ అభివృద్ది చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి srinvasa reddy) అధికారులకు సూచించారు.
క్రీ.శ. ఒకటో శతాబ్ద కాలానికి చెందిన నేలకొండపల్లి వద్ద గల బౌద్ధ క్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదామని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి బౌద్ధ స్తూపం చుట్టూ తిరిగి.. అక్కడి పరిసరాల్లో కలియతిరిగి పరిశీలించారు. ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్, అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పర్యాటకులను, బౌద్ధ భిక్షువులను ఆకట్టుకునేలా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉందని అన్నారు. ఇక్కడి స్థూపం దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది కావడం విశేషమని, శతాబ్దాల చరిత్ర కలిగిన దీని ఆనవాళ్లు పదిలంగా ఉండేలా పనులకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ క్షేత్రం వెంట ఉన్న చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి.. సందర్శకులు, పర్యాటకులను ఆకట్టుకోవచ్చని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఎంపీ స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి.. పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామని అభయం ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
భక్త రామదాసు గృహ సందర్శన
తెలుగు వాగ్గేయకార ఆద్యులు, భద్రాచల శ్రీ సీతారామ దేవస్థానం (Bhadrachal Sri Sitarama Devasthanam) నిర్మించిన భక్త రామదాసు(కంచర్ల గోపన్న) నాలుగు శతాబ్దాల కిందట జీవించిన నేలకొండపల్లిలోని ఆయన స్వగృహాన్ని, పక్కనే నిర్మాణంలో ఉన్న నూతన ధ్యాన మందిరాన్ని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సందర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. భక్త రామదాసు వినియోగించిన బావిని స్వయంగా పరిశీలించారు. అప్పటి విశేషాలను అర్చకులు, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో.. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, కొప్పుల చంద్రశేఖర్ రావు, వెన్నపూసల సీతారాములు, బొడ్డు బొందయ్య, నాగేశ్వరరావు, చిత్తూరి అచ్చయ్య, మామిడి వెంకన్న, వేగినీటి లక్ష్మీ నరసయ్య, బచ్చలకూరి నాగరాజు, మైసా శంకర్, షేక్ మదర్ సాహెబ్, అంజిని, బోయిన వేణు, సీత, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.