Bolu Guri Narasimha: ప్రజా దీవెన మునుగోడు:కేంద్ర ప్రభుత్వం (Central Govt)జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలు గురి నరసింహ (Bolu Guri Narasimha) ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మును గోడు నియో జకవర్గం నిర్మాణ సమావే శంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెటిబడ్జెట్లో ఉపాధి హామీ పనికి (Employment Guaranteed Work) 70 వేల కోట్లు మాత్రమే కేటాయించింద ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.70.000 కేటాయించా లని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని దినాలు పెంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 700 రూపాయలు రోజువారి కొలివ్వాలని ఆయన డిమాండ్ (demand) చేశారు.
మున్సిపాలిటీలలో (Municipalities)కూడా ఉపాధి హామీ పనిని ప్రవేశపెట్టాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసిందిరాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని అమల చేయాలని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల (Pension Disability) పెన్షన్ ఒంటరి మహిళల పెన్షన్ ఇవ్వాలని. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కొరకు ఆరు లక్షల ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ఇల్లు ఇచ్చి ఆరు లక్షల ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చెడుబుద్ధి ఉషయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి గోల్కొండ లింగయ్య, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి కాయతి వెంకన్న, ఇరిగి సంజీవ, కోరే సత్తయ్య వల్లపు పెంటయ్య, నేరెళ్ల సైదయ్య ఎండి జానీమియా, రేవెల్లి అంజయ్య, జిల్లా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.