*దేశం కోసం రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రార్థనలు
Youth Day:ప్రజా దీవెన, కోదాడ: పట్టణములోని స్థానిక నయా నగర్ నందుగల బాప్టిస్ట్ చర్చి (Baptist Church) ఆవరణంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ యేసయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ యూత్ డే Youth Day)వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి యువకులు డ్రగ్స్ (Drugs)కు బానిసలు కాకుండా దైవభక్తిలో కొనసాగాలని తల్లిదండ్రులకు బాటలో నడిచి గురువుల చెప్పిన పాఠాలను అభ్యసించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని తెలిపారు యువత పుట్టిన ఊరికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, తెలిపారు. రాష్ట్రం కోసం దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు ఒంటపాక జానకి యేసయ్య , యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రాజేష్, కోర్ కమిటీ కోఆర్డినేటర్ మాడుగుల సుందరరావు, పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్ ,మోజెస్ కోటేశ్వరి , సునీత ,కవిత, తదితరులు పాల్గొన్నారు