–హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద తనిఖీల్లో వెలుగులోకి
–భారీగా 620 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
— ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
DRUGS: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా మదకద్రవ్యాల అక్రమ రవాణా (Trafficking) మాత్రం ఆగడం లేదు. ఎక్క డో అక్కడ ఏదో మూలన డ్రగ్స్ అనవాళ్ళు నిత్యకృతమవుతున్నా యి. ఈ క్రమంలో హైదరాబాద్ లో డ్రగ్స్ (DRUGS)దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లు పట్టుబడ్డారని చెప్పారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పేర్కొన్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.4.34 కోట్లు ఉంటుందని వివరించారు.
ఈమేర కు ఎస్వోటీ పోలీసులు (SWOT Police)ఈ వివ రాలను మీడియాకు వెల్లడిం చారు.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్ వోటీ పోలీసులు (Task Force, SVT Police) విస్తృతంగా తనిఖీలు చేపడుతు న్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు చేస్తున్నా రు. వాహనాలను, అనుమాని తులను ఆపి తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్వోటీ పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్ స్మగ్లర్లు రెడ్ హ్యాండెడ్ (Drug smugglers are red-handed)గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసిన ఎని మిది మందిని పోలీసులు అరెస్ట్ (arrest) చేశారు . ఇందులో నలుగురు రాజ స్థాన్ కు చెందిన వారని తెలిపారు.