Williamcarey: ప్రజాదీవెన:కోదాడ:పట్టణంలోనిస్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో శనివారం బాప్టిస్ట్ మిషనరీ డాక్టర్ (Baptist Missionary Dr) విలియంకేరి (Williamcarey) 263 వ జయంతి వేడుకలను యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యురాలు ఒంటిపాక జానకి యేసయ్య పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ (United Pastors Association)కోదాడ నియోజకవర్గం అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య మాట్లాడుతూ విలియం కేరి 1793లో ఇండియా మిషనరీ గా వచ్చేసి 42 భాషలు నేర్చుకొని 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశారు.
అనేకమైన సంస్కరణలు (Reforms)జరిగించి భారత దేశంలో ప్రభుత్వం పేరుగాంచారు వారి పేరు మీద 1993లో భారత ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. భారతదేశంలో హాస్పిటల్ స్థాపించిన స్కూల్లో స్థాపించి విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు జి ఆర్ అబ్రహం శ్రీనివాస గౌడ్ సుందర్ రావు రాకేష్ ప్రభుదాస్ నెహెమ్యా మత్తయి మోజస్ రాంబాబు సురేష్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.