Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hydra officers: హై ఓల్టేజ్ లో హైడ్రా..!

–బుల్డోజర్ తో బడాబాబుల్లో గుబు లు పుట్టిస్తోన్న హైడ్రా
–ఇప్పటి వరకు 20కి పైగా భవనా లు, ప్రహారీ గోడలు కూలాయి
–వాటిల్లో కేంద్ర, రాష్ట్ర మాజీ మం త్రులు, వ్యాపారవేత్తలవి సైతం
–తెల్లవారుజామున రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా హైడ్రా అధికారులు
–వాగ్వాదానికి దిగిన వారిని అదు పులోకి తీసుకున్న పోలీసులు

Hydra officers: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగ రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం ఉద్దేశించి ఏర్పాటుచేసిన డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (Hydra )(హైడ్రా) హై వోల్టేజీతో ముం దుకు సాగుతోంది. చెరువులు, కుం టలను చెరబట్టి నిబంధనలకు వి రుద్ధంగా కట్టిన నిర్మాణాల పైకి బు ల్డోజర్‌ తో బడాబాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఎవరు అడ్డు పడినా ఆగకుండా దూకుడు పెంచు తోంది. హైదరాబాద్ నగర నలుది క్కుల్లో ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు మొత్తం వివరాలను తవ్వి తీస్తోంది. నిజానిజాలను నిర్ధారిం చుకుని నేరుగా రంగంలోకి దిగు తోంది.

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రె స్పాన్స్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (Hydra ) అక్రమార్కుల్లో దడపు ట్టిస్తోంది. గండిపేట చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో వెల సిన నిర్మాణాలపై ఆదివారం కన్నెర్ర జేసింది. జంట నగరాలకు తాగు నీటి వనరైన గండిపేట (ఉస్మాన్‌ సాగర్‌) పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌లోని నిర్మా ణాలను నేలమట్టం చేసింది. 20కి పైగా భవనాలు, ప్రహరీ గోడలను యంత్రాలతో కూల్చివేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రము ఖ వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులకు చెందిన భవ నాలు ఉండడం గమనార్హం. గండి పేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయి లో కూల్చివేతలు ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు. కాగా, గండిపేట మండలం ఖానాపూర్‌ గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్ల (Survey nos)లో కొందరు భవనాలు నిర్మించారు. వాణిజ్య సముదాయాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్పా, ఇతర అవసరాలకు వాటిని వినియోగిస్తు న్నారు. ఇవన్నీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్త నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవనాలు ఎఫ్‌టీఎ ల్‌లో ఉన్నాయని నిర్ధారించుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. వ్యూ హాత్మకంగా శనివారం అర్ధరాత్రే యం త్రాలతో సహా సిబ్బందిని తర లించారు. ఆదివారం తెల్లవారు జామునే కూల్చివేత మొదలుపెట్టా రు. నార్సింగ్‌ పట్టణ ప్రణాళికా విభా గం, సాగునీటి, జల మండలి అధి కారులు వీరి వెంట ఉన్నారు. గండి పేట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మరిన్ని నిర్మాణాలపై ఒకటి, రెండు రోజుల్లో చర్యలు ఉంటాయని హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి.

ఆక్రమించి ఆపై క్రికెట్‌ మైదా నం ..రంగారెడ్డి జిల్లా మొయినా బాద్‌ మండలం చిలుకూరు, అప్పో జిగూడ పంచాయతీలలో కొన్నేళ్ల కిత్రం వెస్ట్‌సైడ్‌ పేరిట భారీ వెంచర్‌ వేశారు. ఇక్కడ ప్లాట్లు కొన్న కొంత మంది 500, 1000 గజాల్లో రెండు, మూడు అంతస్తుల్లో పెద్ద భవనాలు నిర్మించారు. ఈ వెంచర్‌లో కొంతభా గం గండిపేట ఎఫ్‌టీఎల్‌లో ఉంది. వారం రోజులుగా ఈ ప్రాంతాన్ని హైడ్రా అధికారులు పరిశీలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య వెస్ట్‌ సైడ్‌ వెంచర్‌లో కూల్చివేతలు ప్రారంభించారు. కాగా, దీనిపక్కనే కొందరు చెరువు ఎఫ్‌టీఎల్‌ను కొంత ఆక్రమించి ఏకంగా క్రికెట్‌ మైదానం నిర్మించారు. దీన్ని సైతం ద్వంసం చే శారు. అప్పోజిగూడ పంచాయతీ లోకి వచ్చే మూడు భవనాలు, చి లుకూరు పరిధిలోని ఒక భవనాన్ని నేలమట్టం చేశారు. ఉదయం నుం చి సాయంత్రం వరకు కూల్చివేతలు చేపట్టారు. ఇక గండిపేట జలాశ యం ఎఫ్‌టీఎల్‌ సముద్ర పట్టానికి 1,790 అడుగుల ఎత్తున ఉంటుంద ని ప్రభుత్వ విభాగాలు గతంలో నిర్ధారించాయి. దీనికి సంబంధించి జలమండలి కూడా ప్రాథమిక నోటి ఫికేషన్‌ ప్రకటించింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎలాంటి నిర్మాణాల కు అనుమతి ఉండదు. కానీ, కొం దరు ప్రముఖులు ‘ఎత్తులు’ వేశారు.

ఎఫ్‌టీఎల్‌లో భూములు/ప్లాట్లను (Lands/Plots in FTL) వ్యర్థాలతో నింపారు. 1,780 అడు గుల ఎత్తులో ఉన్న స్థలంలో 15 అడుగుల మేర వ్యర్థాలు పోశారు. ప్లాట్‌ 1,795 అడుగుల ఎత్తులో ఉన్నట్లు చూపి యథేచ్ఛగా భవ నాలు నిర్మించారు. వీరికి స్థానిక ము నిసిపల్‌, సాగు నీటి శాఖ అధికారు ల్లో కొందరు సహకరించినట్లు గుర్తిం చారు. ఆదివారం కూల్చివేసినవాటి లో అత్యధిక భవనాల విషయంలో ఇదే జరిగిందని అధికారులు చెబు తున్నారు. గండిపేట జలాశయంలో నీటి మట్టం పెరిగితే ఈ భవనాల చుట్టూ నీరు చేరుతోంది. కాగా, ఇక్కడి భవనాల పక్కనున్న స్థలం ఎత్తును పరిశీలించిన అధికారులు వ్యర్థాలు డంప్‌ చేసి నిర్మాణాల స్థ లం ఎత్తును పెంచినట్లుగా నిర్ధారిం చుకున్నారు.అక్రమ నిర్మాణాల పని పట్టే విషయంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యూహాత్మకంగా వ్యవహ రించారు. కూల్చివేతలు ఎక్కడ చే పట్టనున్నారనే సమాచారం గోప్యం గా ఉంచడంతో పాటు ఎలాంటి అ డ్డంకులు లేకుండా స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అయితే, ఆదివారం కూల్చివేతల సందర్భం గా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భవ నాలకు చెందిన కొందరు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. తమవద్ద రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయని, ప్రైవేట్‌ స్థలాల్లో ని ర్మాణాలను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇలాంటివి ఎదురవు తాయని భావించిన హైడ్రా అధికా రులు పోలీసుల సాయం కోరారు. వాగ్వాదానికి దిగుతున్నవారిని సైబ రాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతల పరి సరాల్లోకి స్థానికులు, నాయకులతో పాటు మీడియాను కూడా అను మతించలేదు.

పదిహేనేళ్ల కిందట పంచాయతీ (Panchayat)గా… 2009లో గండిపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మహిళా సర్పంచ్‌ ఒకరు ఎఫ్‌టీఎ ల్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతు లిచ్చినట్లు హైడ్రా అధికారులు (Hydra officers) గు ర్తించారు. ఆ సర్పంచ్‌ ఇప్పటికీ పా త తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని, దీనిపై చర్య తీసుకుంటామని రంగనాథ్‌ తెలిపారు. ప్రస్తుత నిర్మాణాలకు పాత తేదీలతో జారీ చేసిన అను మతులు చెల్లవన్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా గండిపేట చెరువులోకి వ్యర్థాలు చేరి నీరు కలుషితం అవుతోందని, ఈ మంచి నీటి చెరువును కాపాడాల్సిన అవ సరం ఉందని ప్రజలoదరిపైనా ఉం దని పేర్కొన్నారు.ప్రభుత్వంలోని పెద్దలకు ఫోన్లు గండిపేటలో కూల్చి వేతల సమయంలో కొందరు ప్రభు త్వంలోని పెద్దలకు ఫోన్లు చేశారు. కల్పించుకునేందుకు వారు నిరాక రించారు. ఇక కొందరు నిర్మాణదారు లు నాయకులకు ఫోన్లు చేసి మీరు చెబితే ఇక్కడ స్థలాలు కొన్నాం. భవనాలు నిర్మించాం.

ఇప్పుడు పడగొడతాం అంటున్నారు. సా యం చేయండని కోరారు. ఆ నా యకులు స్పందించకపోగా ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫ ర్‌ జోన్‌లో తమకు భూములు విక్ర యించి రూ.కోట్లు సంపాదించిన నాయకులంతా మొహంచాటేయ డంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖానాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ (brs)ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌తో పాటు ఎగువ నుంచి వరద వచ్చే కాలు వలకు అడ్డంగా భవనాలు వెలి శాయి. గండిపేట జలాశయం పరి వాహక ప్రాంతం రక్షణకు ఉద్దేశిం చిన జీవో– 111 పరిధిలో ఖానా పూర్‌తో పాటు వట్టినాగులపల్లి కూడా ఉంది. ఈ రెండు గ్రామాలు గండిపేట మండలంలోకి, మిగతావ న్నీ శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మం డల పరిధిలోకి వస్తాయి. త్వరలో వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణా లు కూల్చివేస్తామని మున్సిపల్‌ అధికారులు (Hydra officers) పేర్కొన్నారు