Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Woman Delivery: మానవత్వం పరిమళించిన వేళ..

— ఆర్టీసీ బస్సులు గర్భిణీకి పురుడు బోసిన కండక్టర్

Woman Delivery: ప్రజా దీవెన, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) సంచ లనాలకు వేదికవుతోoది. ఇటీవల కాలంలో ఏది చేసిన అది అందరి మన్ననలు పొందే విధంగా నలు గురినోళ్లలో నానుతుంది. ఈ క్రమంలోనే రాఖి పర్వదినాన మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. రాఖీ పర్వదినాన్ని పురస్కరించు కొని పుట్టింటికి వెళ్తున్న గర్భిణికి ఆర్టీసీ బస్సులోనే మహిళ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటు కుంది.

రాఖీ పండగ (Rakhi festival)సందర్భంగా వనపర్తికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన గర్భిణి స్త్రీకి (pregnant woman) మార్గమధ్యలో పురిటి నొప్పులు రావడం, అత్యవసర పరిస్థితులు అనివార్యం అవడంతో బస్సులోనే ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో కండక్టర్ భారతీ పురు డు పోసింది. పురుడు తర్వాత తల్లి బిడ్డలు సురక్షితంగా ఉండడంతో ప్రయాణికులు కండక్టర్ నర్సులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇదే సందర్భంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ లు కండక్టర్ భారతీని వేర్వేరు సామాజిక మా ధ్యమాల్లో అభినందనలు తెలిపారు. బస్సులో గర్భిణికి డెలి వరీ (Delivery)చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్‌ జి.భారతికి నా అభినం దనలoటూ మంత్రి పేర్కొన్నారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కితాబునిచ్చారు.ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వ ర్తిస్తూనే సేవాతర్పరతను చాటుతుండటం అభినం దనీయ మని వ్యాఖ్యానించారు.