Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో ఫోటోకు జీవం

–రాష్ట్ర సమాచార పౌర సంబంధా ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: అంకితభావంతో (dedication) సృజనాత్మకoగా తీసిన ఒక ఫోటో కొన్ని పేజీల వార్తా సా రాంశమును అర్థవంతంగా తెలి యజేసి, పాఠకులను ఆలోచింప చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ఫోటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రతి రోజు దినపత్రికలు చదవటం అల వాటని, అన్ని వార్తలు చదవక పో యినా , అన్ని పేజీలలోని ఫోటోల ను చూసి, ఆ వార్హలోని అంశాన్ని అర్థం చేసుకుంటానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న అభయహ స్తం హామీలపై నిర్వహించిన ఫోటో గ్రఫీ పోటీలకు వచ్చిన ఫోటో ఎంట్రీ లను ఇక్కడ ప్రదర్శించారు.

5 కేటగి రీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫోటోలను తీసిన ఫోటోగ్రా ఫర్లుకు మేమెంటో, శాలువా, నగదు పురస్కారాల ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivasa Reddy)అందజేసి అభినందిం చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లా డుతూ ఫోటోకు జీవం పోసేందుకు ఫోటోగ్రాఫర్లు అంకితభావంతో కష్టపడతారని ప్రశంసించారు. తెలంగాణ పాలనలో మార్పు కు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యం లో అభయ హస్తం అమలుకు గత 8 నెలలుగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు కు ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఫోటోగ్రఫీ (Photography) ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.

సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫోటో (photo) తో కూడిన వార్త కు పరిపూర్ణత చేకూ రుతుందని రాష్ట్ర మీడియా అకాడ మీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ వేడుకల్లో ఆయన గౌరవ అతి థిగా హాజరైనారు. క్షేత్ర స్థాయిలో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులను భరించి ఫొటోగ్రాఫర్లు పనిచేస్తారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టుల కంటే ఎక్కువ కష్ట పడి విధులు నిర్వహిస్తారని తెలిపారు. మనిషిని ఆలోచింప జేసే శక్తి ఫోటోలకు వుంటుందని చెప్పారు. ఫోటోగ్రాఫర్ల ను రాష్ట్ర ప్రభుత్వo గౌరవిస్తుందని పేర్కొన్నారు.

5 కేటగిరీలలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే (Photography Day) పోటీలలో 101 మంది 990 ఫోటోలను పంపినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ యం. హను మంతరావు తెలిపారు. ఫోటోగ్రఫీ, జర్నలిజం లలో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు ప్రతి కేటగిరీలో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు 5 కన్సొలేషన్ బహుమతులకు ఫోటోలను ఎంపిక జేసినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యుల తో హాజరయ్యారు. ఈ కార్యక్ర మంలో ఎఫ్ డీ సి ఈ డి కిషోర్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు డి ఎస్ జగన్, డి శ్రీనివాస్, కే వెంకట రమణ, సి ఐ ఈ రాధా కిషన్ , మీడియా అకా డమీ సెక్రెటరీ ఎన్ వెంకటే శ్వర రావు, ఇతర అధికారులు, శాఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.