–ఆందోళనలు విరమించి రోగులకు అండగా నిలవండి
–వైద్యులకు అత్యున్నత న్యాయస్థా నం సుప్రీంకోర్టు పిలుపు
–నేరస్థుడు పశువులా వ్యవహరిం చాడు, హత్యాచార ఘటన భయా నకo
–తొమ్మిది మందితో కూడిన సభ్యు లతో కమిటీ ఏర్పాటు
–మూడు వారాల్లో మధ్యంతర, 2 నెలల్లో పూర్తి నివేదిక
–కోల్కతా హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: హత్యాచార ఘటనకు (Murder incident) నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వైద్యులు ఆందోళనలను విరమించి, ఎప్పటి లాగే వైద్యసేవలు కొనసాగించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అప్పీలు చేసింది. వైద్యు ల సమ్మెతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. వైద్యుల భద్రతపై భరో సా కల్పించేందుకు మేం ఉన్నాం ప్లీ జ్ మమ్మల్ని నమ్మండని వైద్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతి పాదన లు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యు లతో కూడిన జాతీయ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్) ను ఏర్పాటు చేసింది. కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళా శాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూని యర్ వైద్యురాలి పై హత్యాచారం కేసును సుమోటో గా స్వీకరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాస్క్ ఫోర్స్లో హైదరా బాద్ ఏఐజీ ఆస్ప త్రుల చైర్మన్, మేనే జింగ్ డైరెక్టర్ (Chairman, Mayne Jing Director) డా క్టర్ డి. నాగే శ్వర్రెడ్డికి చోటు కల్పిం చింది. పని ప్రదేశాల్లో వైద్యులపై లైంగిక పరమై న హింసను నివారిం చేందుకు, వైద్యులు, నర్సులకు భద్రత, గౌరవ ప్రదమైన పరిస్థితులు కల్పించ డానికి జాతీయ కార్యా చరణ ప్రణాళికను రూపొందించాల ని ఎన్టీఎఫ్కు నిర్దేశించింది. ఈ మేరకు టాస్క్ఫోర్స్, తన మధ్యంత ర నివేదికను మూడు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదికను రెండు నెల ల్లోగా సమర్పించాలని ఆదేశించిం ది.
టాస్క్ఫోర్స్కు కేంద్ర క్యాబినెట్, హోంశాఖ, ఆరోగ్యశాఖ కార్యదర్శు లు (Union Cabinet, Home and Health Secretaries) జాతీయ వైద్యమండలి (ఎన్ఎం సీ) చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫి షియో సభ్యులుగా ఉంటారని ధర్మా నం పేర్కొంది. వైద్యులపై భౌతికదా డులు, లైంగిక హింసకు సంబంధిం చి వైద్యసంస్థలు తమకు తాము ఎలాంటి నిబంధనలను రూపొం దించుకోకపోవడం తీవ్ర ఆందోళన కరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ని ఽత్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. వైద్యుల భద్రత కోసం చట్టా లు ఉన్నాయని అయితే అవి వ్యవ స్థాగత సమస్య (సిస్టమెటిక్ ఇష్యూ స్)లను పరిష్కరించలేవు అని వ్యా ఖ్యానించింది.
పనిచేసే చోట వైద్యు లకు భద్రతాలేమిపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయి లో మార్పులు తెచ్చేందదుకు మరో అత్యాచారమో హత్యో జరిగేదాకా ఎదురుచూడకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్జీ కర్ ఆస్ప త్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి పేర్లు, ఫొటో లు, వీడియోలను తక్షణమే సామా జిక మాధ్యమాల్లోంచి తొలగించాల ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలో నడుస్తున్న ఢిల్లీలోని ఆర్ఎం ల్ ఆస్పత్రి వైద్యులు తమ సమ్మెకు ముగింపు పలికారు. జూని యర్ వైద్యురాలిపై హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించ డాన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసి యేషన్ స్వాగతించింది. మరోవైపు ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవ కలపై విచారణ జరిపేందుకు స్వా మి వివేకానంద స్టేట్ పోలీస్ అకాడ మీ (State Police Academy) ఐజీ డాక్టర్ ప్రణవ్ కుమార్ సార త్యంలో నాలుగు సభ్యులతో కూడి న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అరుణా షాన్బాగ్ను ప్రస్తావిం చిన సీజేఐ
కోల్కతా హత్యాచారం అంశంపై విచారణ సందర్భంగా సీజేఐ (cgi) జస్టిస్ చంద్రచూడ్ అరుణా షాన్బాగ్ ఉ దంతాన్ని ప్రస్తావించారు. 1973 నాటి ఈ ఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ముంబై లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్సుగా పని చేసే అరుణా షాన్బాగ్పై 1973 నవం బరు 27వ తేదీ రాత్రి ఆస్పత్రిలోని వార్డు బాయ్ సోహన్లాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె మెడకు.. కుక్కలను కట్టివే యటానికి ఉపయోగించే గొలుసు వేసి బిగించటంతో అరుణ మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది. నాటి నుంచి 2015లో మరణించేవరకూ అరుణ అచేతనస్థితిలో (పర్సిస్టెంట్ వెజి టేటివ్ స్టేట్) ఉండిపోయారు. అదే ఆస్పత్రిలో పని చేసే సందీప్ సర్దే శాయ్ అనే డాక్టర్తో నిశ్చితార్థం జరిగి, మరికొన్ని నెలల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సిన అరుణా షాన్బాగ్ జీవితం ఈ దారుణ ఘటనతో సర్వనాశన మైపోయింది. అయితే, ఆస్పత్రి సిబ్బంది నాలుగు దశాబ్దాలపాటు ఆమెకు సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టారు. అరుణ నిమోనియా తో 2015 మే 18న మరణించారు. ఆమె జీవితాన్ని నాశనం చేసిన వార్డు బాయ్ సోహన్లాల్ కేవలం ఏడేళ్లపాటు జైలులో ఉండి 1980 లో విడుదలయ్యాడు. ఆస్పత్రిలో జరిగే వైద్య ప్రయోగాల్లో ఉపయో గించే కుక్కల కోసం తీసుకొచ్చే ఆహారాన్ని సోహన్లాల్ దొంగిలి స్తుండటంతో అరుణ అతడిని మందలించి, అధికారులకు ఫిర్యా దు చేస్తానని చెప్పారు. దీనిపై కక్షతో ఆమెపై సోహన్లాల్ ఆఘాయిత్యా నికి పాల్పడ్డాడు.