–పి.వై.ఎల్ నల్లగొండ జిల్లా కార్యద ర్శి చారి
Political training classes: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ప్రగతిశీల యువజన సంఘం పి.వై.ఎల్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు (Political training classes)ఈనెల 22, 23 న మహబూబాబాద్ జిల్లా మం డల కేంద్రంలో జరుగ బోతున్నా యని, ప్రగతిశీల యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారిలు ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలో పట్ట ణంలోని శ్రామిక భవన్ (Shramika Bhavan)వద్ద కరప త్రాలు ఆవిష్కరించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో 40 కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయ న అన్నారు. ఎన్నికల్లో మోడీ ఇచ్చి న 2 కోట్ల ఉద్యోగాల కల్పన నీటి బుడగలానే మారిందని అన్నారు.
నిరుద్యోగ సమస్య (Unemployment is a problem) పరిష్కారం చేయకుండా కార్పొరేట్ సంస్థలకు, ఆదాని, అంబానీలకు, (For corporates, the Adanis, the Ambanis,) బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తున్నారని దుయ్య బట్టారు. దేశంలో మహిళలపై జరుగుతున్న హింస, దాడులు, లైంగిక వేధింపుల్లో దేశం మొదటి స్థానంలో ఉన్నదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉన్నదో అర్థం అవు తుందని అన్నారు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నా రని, ప్రజలకు ఉపయోగపడే చట్టాలను రద్దుచేసి, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ క్యాలండర్ విషయంలో స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నింటికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పటివరకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సామాజిక, ఉద్యమ, హార్దిక, అసమానతలపై ఈ శిక్షణా తరగతులలో చర్చ ఉంటుందని, యువకులకు సామాజిక స్పృహ, రాజకీయ కర్తవ్యాలు అవసరం అని, అందులో భాగంగానే జరిగే క్లాసులను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నాయకులు నర్సింహా, నగేష్,క్రాంతి, శంకర్, సురేష్, భరత్, తదితరులు పాల్గొన్నారు.