Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shekhar Reddy: మహిళా సంఘాలు అన్ని రంగాల్లో ముందుండాలి

— డిఆర్ డి ఏ పిడి శేఖర్ రెడ్డి

Shekhar Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: మహిళా సంఘాలు (Women’s Associations) అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా గ్రామీణ భివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి కోరారు. బుధవారం శాలిగౌరారం లో మహిళా సమాఖ్య (Women’s Federation) సమావేశా నికి ముఖ్య అతిధిగా శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్య క్రమాలను జిల్లాలో విజయవం తంగా చేపట్టాలని సూచించా రు.మహిళా సంఘాలు, చిన్న సంఘాలు, గ్రామ సంఘబంధాలు నెలలో నిర్దేశించిన మాదిరిగా సమా వేశాలు విధి గా ఏర్పాటు చేసుకోవా లన్నారు.స్త్రీనిధి లోన్ ల విషయం లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి రెగ్యులర్ గా రికవరీ చేయా లని కోరారు.గంజాయి, డ్రగ్స్ (Cannabis, drugs)లాంటి మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా గ్రామ, మండల స్థాయిలో ర్యాలీలు నిర్వహించి మహిళలను చైతన్య వంతులు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి,డి ఆర్ డి ఏ పిడిఎం మోహన్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఏఇ సంపత్ కుమార్, ఏపీఎం జానకి,స్త్రీనిది ఏఎం విజయ శాంతి,సిసి లు చంద్రయ్య, బాలు,శంకరయ్య,తాటిపాముల సైదులు,తదితరులు పాల్గొన్నారు.