Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rice millers: కస్టమ్ మిల్లింగ్ రైస్ ను తక్షణమే పూర్తి చేయాలి

Rice millers: ప్రజా దీవెన, నల్లగొండ: రైస్ మిల్లర్లు కస్టమ్ (Rice millers) మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో (Rice millers) వాన కాలం ,గత యాసంగి సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు.గత వానా కాలానికి సంబంధించి 71% సీఎం ఆర్ (cmr)పూర్తి చేయడం జరిగిందని, తక్కిన 29 శాతాన్ని రైస్ మిల్లర్లు రోజువారి నిర్దేశించిన ప్రకారం సెప్టెం బర్ లోపు పూర్తి చేయాలని అన్నా రు. ఇందు కుగాను ప్రతిరోజు సీఎం ఆర్ డెలివరీ చేయాలని అన్నారు. యాసంగికి సంబంధిం చిన 54% సీఎంఆర్ (cmr)పూర్తి కాగా, తక్కిన వి డెలివరీ చేయడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలని ,రెండు సీజన్లకు సంబం ధించిన సీఎంఆర్ ను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ వెంకటే శ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బం ది ,రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.