Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

That’s it… that’s it… governance..! అదిగో…అల్లదిగో…పాలనాసౌథం..!

--సర్వాంగ సుందరంగా ముస్తాబు --మంత్రి జగదీష్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ లో.... -- సకల హంగులతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం -- 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో -- జీ ప్లస్‌ టు అంతస్తుల్లో 37 శాఖలకు గదులు, ఉద్యోగుల కోసం క్వార్టర్స్ --10 ఎకరాల్లో గ్రీనరీ, ల్యాండ్‌ స్కేప్‌ సూర్యుడి ఆకారంలో హెలిప్యాడ్‌ పార్క్‌ -- రాష్ట్రంలోనే తొలిసారిగా సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు -- రూ. 65 కోట్లతో పూర్తి చేసిన ప్రభుత్వం -- ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం

అదిగో…అల్లదిగో…పాలనాసౌథం..!

–సర్వాంగ సుందరంగా ముస్తాబు

–మంత్రి జగదీష్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ లో….

— సకల హంగులతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం

— 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో

— జీ ప్లస్‌ టు అంతస్తుల్లో 37 శాఖలకు గదులు, ఉద్యోగుల కోసం క్వార్టర్స్

–10 ఎకరాల్లో గ్రీనరీ, ల్యాండ్‌ స్కేప్‌ సూర్యుడి ఆకారంలో హెలిప్యాడ్‌ పార్క్‌

— రాష్ట్రంలోనే తొలిసారిగా సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు

— రూ. 65 కోట్లతో పూర్తి చేసిన ప్రభుత్వం

— ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం

 

ప్రజా దీవెన/సూర్యాపేట:పచ్చని పచ్చదనం…విశాలమైన భవనాలు… క్వార్టర్లతో అదిగో అల్లదిగో అంటూ ప్రారంభానికి సిద్ధమైంది సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనం. సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సకల హంగులతో సమీకృత కలెక్టరేట్‌ సాక్షాతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవo కానుంది.

సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడకుడలో 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిపాలన భవనంతో పాటు అధికారుల కోసం నివాస సముదాయం నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. రెండతస్తుల భవనంలో కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్లతోపాటు మొత్తం ఒకే చోట 37శాఖలు ఉండేలా గదులు కేటాయించారు.

రాష్ట్రంలోనే తొలి సారిగా సౌర విద్యుత్‌తో కార్యాలయాలు నడిచేలా నిర్మించుకున్న ఈ కలెక్టరేట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 65 కోట్లు ఖర్చు చేయగా ఇప్పటికే పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యాపేట పర్యటనకు రానున్న నేపథ్యంలో దీనిని ప్రారంభించనున్నారు.

ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నెల 20 వ తేదీన సిఎం ప్రారంభించిన మరుసటి రోజు నుంచే ఇక్కడి నుంచి పరిపాలన చేసేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి.

దివ్యాంగులు, వృద్ధులు మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న కార్యాలయంలోకి వచ్చేందుకు ఇబ్బంది పడకుండా రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.శాఖల వారీగా గదుల కేటాయింపు: సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గదుల కేటాయింపు దాదాపు పూర్తికావచ్చింది. దాదాపు 35 శాఖలు ఇక్కడ ఉండేలా గదులను కేటాయించారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌ చాంబర్‌తోపాటు ఇద్దరు అదనపు కలెక్టర్ల చాంబర్లు ఏర్పాటు చేశారు. వారి సహాయకులు ఉండేందుకు ప్రత్యేక చాంబర్లు, వాటి సమీపంలోనే దాదాపు 500 నుంచి 650 మంది కూర్చునేలా మీటింగ్‌ హాళ్లు, రెండు వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లను సైతం సిద్ధ్దం చేశారు. వీటితోపాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆయా శాఖలకు గదులను కేటాయించారు.

మొదటి అంతస్తులో జిల్లా మంత్రి చాంబర్‌ను, వారి సిబ్బందికి కూడా ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో మినీ మీటింగ్‌ హాల్‌, రెండో అంతస్తులో శాఖల వారీగా గదులను కేటాయించారు. ఉద్యోగుల సంఖ్య ఆధారంగా శాఖలకు గదులను ఏర్పాటు చేశారు. ఒకరిద్దరు ఉద్యోగులు ఉన్న శాఖలకు ప్రత్యేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేసి ఇవ్వనున్నారు.