Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: అధిష్ఠానంతో సీఎం విస్తృత చర్చలు

CM Revanth Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడి నియా మకం, మంత్రివర్గ విస్తరణ, నామి నేటెడ్ పదవులు తదితర అంశా లపై ఢిల్లీలో ఏఐసీసీ (aicc) అధిష్టానంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విస్తృతస్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌తోపాటు ఉప ము ఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క, మంత్రి ఉత్త‌మ్ శుక్ర‌వారం జ‌రిగిన‌ సమావే శంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ (Congress) పెద్ద‌లు సోనియా గాంధీ, రాహుల్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, (Sonia Gandhi, Rahul, General Secretary KC Venugopal) తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల చీఫ్‌ దీపా దాస్ మున్షీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.కాగా, ఈ సమావేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చ‌ర్చించారు. బీసీ వ‌ర్గాల‌కు పదవి ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.