–ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కె ట్లో పాల్గొనకుండా నిషేధం
–కుప్పకూలిన రిలయన్స్ గ్రూప్ షేర్లు
–మరో 24 సంస్థలపైనా చర్యలతో గ్రూప్ షేర్లు ఢమాల్
Anil Ambani: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: అనిల్ అంబానీ (Anil Ambani) అనర్హతకు గురయ్యారు. అనిల్ అంబానీ కంపెనీలో ఆటు పోట్ల కారణంగా ఆఖరికి ఆయనపై సెబీ నిషేధం విధించింది. తండ్రి ధీరూబాయ్ అంబానీ మరణానం తరం ఆస్తుల పంపకం దగ్గర అన్న ముకేశ్ అంబానీతో అనిల్ అంబానీ బాగానే గొడవ పడ్డారు. చివరికి కొంతమంది పెద్దల మధ్యవర్తిత్వం తో 2005లో ఇద్దరి మధ్య ఆస్తుల పంపకం ఒప్పందం కుదిరిన విష యం తెలిసిందే. టెలికాం, ఇంధనం, ఫైనాన్స్ రంగాలను (Telecom, Energy and Finance sectors) అనిల్ తన అధీ నంలోకి తెచ్చుకోగా ముకేశ్ అంబా నీ పెట్రో రసాయనాలతో సరిపుచ్చు కున్నారు.
ఆస్తుల పంపకం తర్వాత అనిల్ అంబానీ (Anil Ambani) పెద్ద ఎత్తున తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేం దుకు సిద్ధమయ్యారు. అయితే ఇవే వీ కలిసి రాక చివరికి దాదాపు అన్ని సంస్థలు దివాలా తీశాయి. దీంతో 2008లో 4,200 కోట్ల డాలర్ల ఆస్తు లతో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానం లో ఉన్న అనిల్ అంబానీ ఇప్పుడు కనీసం ఆ చర్చలో కంటికి కూడా కనిపించడం లేదు. మరోవైపు అన్న ముకేశ్ అంబానీ మాత్రం టెలికాం, ఫైనాన్స్, రిటైల్ రంగాల్లోకి ప్రవేశించి ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగా రు. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కామ్) కోసం ఎరిక్సన్ ఏబీ ఇండియా నుంచి తీసుకున్న రూ.5 50 కోట్ల అప్పు చెల్లించలేక పోవడం తో 2019లో సుప్రీంకోర్టు అప్పు చెల్లిస్తారా, లేక జైలుకు వెళతారా అని అనిల్ అంబానీని (Anil Ambani) హెచ్చరించిం ది. దాంతో తమ్ముడిని జైలు శిక్ష నుంచి రక్షించేందుకు, ముకేశ్ అంబానీ ఆ అప్పు తీర్చి అనిల్ అంబానీని ఆదుకున్నారు.
అనిల్ అంబానీ పై ఐదేళ్ల నిషేధం.. పారిశ్రామికవేత్త, రిల యన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరె క్టర్ అనిల్ అంబానీ తో పాటు మరో 24 మందికి స్టాక్ మార్కెట్ నియం త్రణ మండలి సెబీ పెద్ద షాకిచ్చింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిల యన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల మళ్లిం పు వ్యవహారంలో ఆయనపై ఏకం గా రూ.25 కోట్ల జరిమానా విధిం చింది. దీనికి తోడు ఆయన ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొ నకుండా నిషేధం విధించింది. ఈ కాలంలో అనిల్ ఏ లిస్టెడ్ కంపెనీలో గానీ, సెబీ వద్ద నమోదైన సంస్థల్లో గానీ ఎటువంటి డైరెక్టర్ లేదా కీలక మేనేజ్మెంట్ పదవులు (కేఎంపీ) చేపట్టకూడదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు సమ స్యల్లో ఉన్న అనిల్ అంబానీ వ్యాపా ర సామ్రాజ్యం కథ ముగిసినట్టేనని భావిస్తున్నారు. భారత కార్పొరేట్ చరిత్రలో సెబీ ఒక పారిశ్రామికవేత్త పై ఇంత భారీగా జరిమానా (fine)విధిం చడం ఇదే మొదటిసారి కాగా ఈ విషయంపై అనిల్ అంబానీ నేతృ త్వంలోని రిలయన్స్ గ్రూప్ ఇంత వరకు స్పందించలేదు.
అనిల్ అంబానీ అనిల్(Anil Ambani) ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్గా తన పరపతిని ఉపయోగించి రిల యన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తు న్నా, కంపెనీ నిధులను రుణాల పేరు తో తన నిర్వహణలోని అల్లా టప్పా కంపెనీలకు రూ.14,577.68 కోట్లు దారి మళ్లించినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఇందులో రూ.12,487.56 కోట్ల మొత్తాన్ని ఊ రూ పేరు లేని 47 డొల్ల కంపెనీలకు మళ్లించారని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఫోరెన్సిక్ ఆడిట్లో తేలిం ది. ఈ విషయంలో అనిల్ అంబా నీకి సహకరించిన 24 సంస్థలపైనా ఐదేళ్ల నిషేధంతో పాటు రూ.21 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.625 కోట్ల భారీ జరిమా నాలు విధించింది. ఆర్హెచ్ఎఫ్ఎ ల్పైనా ఆరు నెలల నిషేధంతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది.
మరోవైపు సెబీ (sebi)కూడా 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఖాతాలను పరిశీ లించి నిధుల మళ్లింపు నిజమేనని నిర్ధారించుకుంది. ఈ విషయంలో అనిల్ అంబానీకి అమిత్ బప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా అనే వ్యక్తులు సహకరించినట్టు విచారణలో తేలింది.తాజా పరి ణామాలతో రిలయన్స్ గ్రూప్ కంపె నీల షేర్లు శుక్రవారం కుప్పకూలా యి. బీఎస్ఈలో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు 10.07 శాతం నష్టంతో రూ.2 11.70 వద్ద ముగియగా ఎన్ఎస్ ఈలో 10.91 శాతం నష్టంతో రూ.2 09.99 వద్ద క్లోజైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేరు కూడా బీఎస్ ఈ, ఎన్ఎసీల్లో 5 శాతం నష్టంతో రూ.4.46 వద్ద ముగిసింది. రిలయ న్స్ పవర్ షేరు బీఎస్ఈ, ఎన్ఎస్ ఈల్లో ఏకంగా లోయర్ సర్క్యూట్ బ్రేకర్ను తాకి వరుసగా రూ.34.48, రూ.34.45 వద్ద ముగిశాయి.