Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutta Sukhem Dar Reddy: రైతు ప్రయోజన రెవిన్యూ చట్టం

–రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి లో కసరత్తు
–జిల్లా స్థాయి రెవిన్యూ సదస్సులో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి

Gutta Sukhem Dar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రస్తుత 2020 రెవెన్యూ (ఆర్ ఓ ఆర్) చట్టం వల్ల కలిగే ఇబ్బందు లను తొలహించి రైతులకు ఉపయో గకరమైన చట్టాన్ని తీసుకొచ్చేం దుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నూత న ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి Gutta Sukhem Dar Reddy)తెలిపారు.శుక్రవారం నల్గొం డ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024 ము సాయిదా పై ఏర్పాటు చేసిన సద స్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రైతుకు కలిగే ఇబ్బందులను పరి ష్కరించే అవకాశం చట్టంలో ఉండా లని, అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని, 2020 లో ఏర్పాటు చేసిన చట్టంలో అప్పీళ్లకు అవకాశం లేదని ,కొత్త చట్టంలో వాటికి స్థానం కల్పించడం జరుగుతున్నదని, ఎక్కడైనా పొర పాటు జరిగితే సవరించే అవకాశం సైతం నూతన ప్రతిపాదిత చట్టంలో ఉందని, రానున్న అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలలో (In assembly and legislative council meetings) కొత్త చట్టా న్ని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకొ చ్చేందుకు అవకాశం ఉందని ఆయ న తెలిపారు. ప్రస్తుతం వేల సంఖ్య లో బోగస్ పాస్ పుస్తకాలు ఉన్నా యని ,పాసు పుస్తకాలు ఉన్నవాళ్లకి భూములు లేవని ,ఇలాంటివన్ని తొలగించి పారదర్శక చట్టాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయ త్నంలో భాగంగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ మండలం ఎంపిక చేయడం జరిగిందని, చట్టాలు మారడం వల్ల వ్యవస్థలు కూలిపోకూడదని ఆయ న అన్నారు.

నూతన రెవెన్యూ చట్టంపై (On the New Revenue Act)అన్ని జిల్లాలలో రాష్ట్రవ్యా ప్తంగా అభిప్రాయాలను సేకరించి కొత్త చట్టం తెచ్చేందుకు కృషి చేయ డం జరుగుతున్నదని, కొత్త చట్టం పట్ల చాలామంది అభినందిస్తున్నా రని, మార్పులు ,చేర్పులు సూచిస్తు న్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కు ఇంకా మెరుగైన భూ రికార్డుల విధానాన్ని తీసుకువచ్చేం దుకు 2020 చట్టం స్థానంలో 2024 చట్టం తెచ్చే క్రమంలో భాగంగా ఆగస్టు 3 నుండి క్షేత్ర స్థాయిలో సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతున్నదని, రైతులకు నష్టం కలగకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ,అందుకే బహిరంగ చర్చను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు సంఘాలు, మేధా వులు, విద్యావేత్తలు, తదితరులతో సూచన సలహాలు తీసుకున్న ఈ సమావేశంలో ముందుగా అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ప్రతి పాదిత రైట్స్ ఆఫ్ రికార్డ్ (ఆర్ ఓ ఆర్ )చట్టంపై సమావేశానికి హాజ రైన వారందరికీ వివరించారు.

అం తేకాక 2020 ఆర్వోఆర్ చట్టం, 202 4 ప్రతిపాదిత చట్టాలలోని తేడా లను సైతం వివరించారు.ఈ చర్చా వేదిక లో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్సి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత చట్టంలో ఇబ్బందులను సులభంగా పరిష్క రించే పరిష్కారం కొత్త చట్టం ద్వారా అమలవుతుందన్న నమ్మకం తన కుందని ,రైతులకు ఇబ్బందులు లేన ప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద ని అన్నారు.భూములకు పహానితో సహా కార్డుదారుల జాబితా రూపొం దించాలని, కొత్త చట్టంలో భూ సమ స్యల పరిష్కారానికి ఒక సమయా న్ని నిర్దేశించాలని, ముసాయిదా చట్టంపై విస్తృత ప్రచారం కల్పిం చాలని, అవసరమైతే కళాజాత బృందాలను ఏర్పాటు చేయాలని విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ సూచించారు.మాజీ జెడ్పి టిసి పాశం రామ్ రెడ్డి (rami reddy)మాట్లాడుతూ ప్రతిపాదిత రెవెన్యూ చట్టంపై సోష ల్ మీడియా ద్వారా విస్తృత పరిచ యం కల్పించాలని, చట్టం అమల య్యే లోపు సాధ్యమైనంతగా క్షేత్ర స్థాయికి చట్టంలోని విషయాలను తీసుకువెళ్లాలని సూచించారు.

చర్చలు, సమావేశాల పేరున కాల యాపన చేయకుండా ఆర్డినెన్స్ ద్వా రా బిల్లు తీసుకురావాలని, భూము ల సర్వేకు విశ్రాంత ఉద్యోగులు, లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి లీగల్ సెల్ ల ను ఏర్పాటు చేయా లని, చేను పేరుపై భూమి ఉండా లని, కొత్త చట్టంలో అనుభవదారు పేరు ఉండాలని, ప్రభుత్వ భూము లు, రోడ్లు, స్థలాలకు ఒక అధికారి డిజిగ్నేషన్ పై ఏర్పాటు చేయాలని రామచంద్రరావు సూచించారు.

కనగల్ కు చెందిన రైతు నాయ కుడు రాoరెడ్డి (ram reddy) మాట్లాడుతూ కొత్త చట్టంలో పహాని తప్పనిసరి, సర్వే నంబర్ తో సహా ఫోటో కూడా జత చేస్తే బాగుంటుంది. నక్ష తప్ప నిసరి ఉండాలన్నారు. ఈ సదస్సు లో టీజేఏ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, అడ్వకేట్ నారాయణ రావు, రైస్ మిల్లర్ల సంఘం వీర్లపల్లి వెంకటేశ్వర్లు, విశ్రాంత తహసిల్దార్ ఆంజనేయులు, వెంకటరాములు తదితరులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా స్థానిక సంస్థల టీ. పూర్ణచంద్ర, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్, వివిధ వర్గాల ప్రతిని ధులు పాల్గొన్నారు.