–నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు లు, ర్యాలీలు
–నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ : మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేం దుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) అన్నా రు. మిషన్ పరివర్తన్లో భాగంగా శుక్ర వారం స్థానిక కామినే ని వైద్య కళాశాలలో మాదక ద్రవ్యా ల నిర్మూలన, ఈవ్ టీజింగ్, సోషల్ మిడియా, యాంటీ ర్యాగింగ్ చట్టా లు, సైబర్ నేరాలపై (On eve teasing, social media, anti-ragging laws, cyber crime) మెడికల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్ర మానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డుతూ కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కు సమా చారం ఇవ్వాలన్నారు. వారి వివ రాలు గోప్యంగా ఉంచుతామ న్నా రు కార్యక్రమంలో అడిషనల్ ఎస్నీ రాములు నాయక్, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనా రాయణ, షీటీమ్ ఇన్చార్జి సీఐ కరుణాకర్, నార్కట్ పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతి కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ బాబా సాహెబ్ కాడగి, డెంటల్ కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ మహేశ్, డాక్టర్లు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : విద్యార్థులు మాదకద్రవ్యా లకు దూరంగా ఉండా లని మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర్ రాజు సూచించారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో స్థానిక కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (In Govt Degree College)శుక్రవారం విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించి మాట్లాడారు. మాదకద్రవ్యాల విక్రయాల వివ రాలు, పోలీసులకు సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచు తామన్నారు. టూటౌన్ సీఐ నాగా ర్జున, వన్డేన్ ఎస్ఐలు సుధీర్కు మార్, శేఖర్ పాల్గొన్నారు. పెద్దఅడిశర్లపల్లి : గుడిపల్లి జడ్పీ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివార ణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివార ణకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐఐ నర్సిహులు, ఎంఈఓ రాము, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.