–కేంద్ర మంత్రి గడ్కరీకి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి వినతి
Jupalli Krishna Rao: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కృష్ణా నదిపై సోమశిల (తెలంగాణ), సంగమేశ్వర (ఆంధ్ర ప్రదేశ్) మధ్య డబుల్ డెకర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ (A double-decker cable-stayed iconic bridge structure)ప్రక్రి యను వేగవంతం చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మం త్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1,082.56 కోట్ల తో నిర్మించ తలపెట్టిన తీగల వంతె న నిర్మాణం వివిధ కారణాల వల్ల రెండేళ్లుగా పెండింగ్లో ఉందని తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి గడ్కరీ తో జూపల్లి సుధీర్ఘంగా చర్చించారు. శనివారం ఢిల్లీలోని గడ్కరీ నివాసం లో ఆయనతో మంత్రి జూపల్లి (Jupalli Krishna Rao)భేటీ అయ్యారు.
తీగల వంతెన నిర్మాణం తో రెండు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ పర్యాటక రంగాన్ని (Eco and temple tourism) ప్రోత్సహించడమే కాకుండా, తెలంగాణ నుంచి తిరుపతికి 70–80 కి.మీ. దూరం తగ్గే అవకా శం ఉందని తెలిపారు. మరోవైపు అలంపూర్ ఎక్స్ రోడ్ (ఎన్హెచ్– 44) నుంచి నల్లగొండ (ఎన్హెచ్– 565) వరకు ఉన్న 203.5 కి.మీ రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఐకానిక్ బ్రిడ్జిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, సెప్టెంబరు నెలా ఖరులోగా టెండర్లు ప్రారంభమ య్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జూపల్లి (jupalli)చెప్పారు. కాగా, తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేం ద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మంత్రి జూపల్లి కృష్ణా రావు (Jupalli Krishna Rao) కోరారు. షెకావత్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో జూపల్లి భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో మంత్రి జూపల్లి మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు.