Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pole Satya Narayana: మధ్యాహ్న భోజనo హరే రామ హరే కృష్ణకు వద్దు

Pole Satya Narayana: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్న మధ్యా హ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ఇవ్వాలనే ముఖ్య మంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకో వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్య నారాయణ (Pole Satya Narayana) డిమాండ్ చేశారు. సోమవారం దొడ్డి కొమరయ్య భవన్లో ( Komaraiya Bhavan)తెలంగాణ మధ్యా హ్న భోజన పథకం వర్కర్స్ యూని యన్ సమావేశం జిల్లా అధ్యక్షు రాలు ఎస్ కే కరీమున్నీసా అధ్య క్షతన జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లు (bill) రాకపోయినా అప్పులు చేసి పిల్లలకు వండిపెట్టి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆలోచించి సరైన వేతనం ఇస్తూ , ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తుందని ఆశతో పనిచేస్తున్నారని అన్నారు. ఒకపక్క ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలు, మరోపక్క పిల్ల లకు ఇచ్చే మెనూ చార్జీలు, కార్మి కులకు (Menu charges, for workers)ఇచ్చే వేతనాలు నెలల తర బడి పెండింగ్లో ఉంటున్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ఇచ్చి కార్మికుల ఉపాధిని పోగొట్టాలని ఆలోచన దుర్మార్గమైన చర్య అని అన్నారు. గతంలో అక్షయ ఫౌండే షన్ ద్వారా విద్యార్థులకు భోజన సరఫరా చేసిన సందర్భంలో ఎంత అధ్వానంగా ఉందో 2008 కాగ్ నివేదిక వెల్లడించింది.

కేంద్రీ కృత వంటశాల (Central kitchen) ద్వారా ఒకే దగ్గర ఉండి సప్లై చేయడం ద్వారా నాణ్యత ఉండదు. పిల్లలకు చేరే సమయానికి పాచి పోయే అవకాశం ఉంటుందని, పిల్లలకు పౌష్టికాహారం అందకుండా పోతుందని అన్నారు. పాఠశాలలోనే కార్మికులు వండడం ద్వారా వేడివేడి ఆహారం తినడానికి అవకాశం ఉంటుందని అనేక అధ్య యనాలు తెలియజేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ఇచ్చే ఆలోచన విర మించుకోవాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, కాం గ్రెస్ పార్టీ ఎన్నికల (Congress Party Elections) మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం, గుర్తింపు కార్డు లు, ప్రోసిడింగ్ ఆర్డర్స్, ప్రమాద బీ మా సౌకర్యం కల్పించాలని డిమాం డ్ చేశారు. లేనియెడల మ ధ్యాహ్న భోజన కార్మికుల అంద రితో కలిసి చలో కొడంగల్ ముఖ్య మంత్రి ఇంటిని ముట్ట డిస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ తెలం గాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు మహేశ్వరి, దేబోరా, ముత్యాలు, కృష్ణమ్మ, నిర్మల, అండాలు ,చంద్రశేఖర్ , కె.పద్మ, డి.పార్వతమ్మ, మాధవి తదిత రులు పాల్గొన్నారు.