Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vemula Viresham: నాణ్యమైన భోజనం అందించండి

— నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Vemula Viresham: ప్రజా దీవెన, నకిరేకల్ : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Viresham)ఆదేశించారు. మంగళ వారం తన క్యాంప్ కార్యాలయంలో నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహా ల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వార్డెన్లు పాల్గొ న్నారు. అనం తరం నకిరేకల్ మున్సిపాలిటీలోని 16వ వార్డుకు చెందిన అనుముల పద్మకు మం జూరైన రూ.2 లక్షల సీఎం సహాయ నిధి (CM Relief Fund)చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ లో చేరికలు…
కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన పార్టీల నాయకులు (party leaders), కార్యకర్తలు మంగళవారం నకి రేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాం గ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో ఆల కుంట్ల సైదులు, ఆలకుంట్ల కిష్టయ్య, చంద్రయ్య, పుల్లయ్య, అంజయ్య, వెంకన్న, యాదయ్య, బాబురావు, లింగయ్య, సిద్ధు, మధు, సైదులు, నర్సయ్యతోపాటు మరో 30 మంది ఉన్నారు.