–ఇంజనీరింగ్ విద్యార్థులు చక్కని ఉదాహరణ
–ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి
Acharya Alwala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) ఇంజనీరింగ్ కళాశాల లో నూత నంగా ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు శ్రీమతి సిహెచ్ సుధారాణి అధ్యక్షతన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో కళాశాల లో అందుబాటులో ఉన్న కోర్సులు ల్యాబ్, హాస్టల్ సదుపాయాలు, పరీక్ష విధి విధానాలు, వంటి అంశా లపై అధ్యాపకులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధాస క్తులతో అందుబాటులో ఉన్న సదు పాయాలను వినియోగించుకుంటూ ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.
నేడు విశ్వవ్యాప్తంగా ఇంజనీరింగ్ సేవలో (In engineering service)భారతీయులు ఉండడం మన మీద సంపత్తికి తార్కాణం అన్నారు. విశ్వవి ద్యాల య అధ్యాపకులు సదా విద్యార్థుల సేవలో ఉంటూ వారి సర్వతో ముఖాభివృద్దికి తోడ్పడుతారని తెలిపారు. మంచి చెడుల విచక్షణ తో సన్మార్గంలో పయనిస్తూ తల్లిదం డ్రులకు దేశానికి కీర్తిని అందించాల ని సూచించారు. విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం వివిధ శాఖ అధిపతులు మరియు అధికారులు వారి యొక్క కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. ఎన్ఎస్ఎస్ (NSS)సేవలపై డా మద్దిలేటి, ఉపాధి అవకాశాలు మరియు ప్లేస్మెంట్స్ పై డా ప్రశాంతి, విద్యార్థి కేంద్ర బోధనపై డీన్ ఆచార్య రేఖ, స్పోర్ట్స్ పై డా హరీష్ కుమార్ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు లైబ్రరీ మరియు కళాశాల క్షేత్ర పర్యటనలో అందుబాటులో ఉన్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్ సుధారాణి, డీన్ ఆచార్య రేఖ, డా వై ప్రశాంతి, డా మద్దిలేటి, డా విజయ్ కుమార్, డా రామచంద్రుడు, అశ్విని తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.