Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM MODI: “జనధన్’కు పదేళ్లు

— ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టు

PM MODI:ప్రజా దీవెన, దిల్లీ: దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధా నమంత్రి జనధన్ యోజన పథకా నికి పదేళ్లు పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) పాలనలో సమ్మిళిత అభివృద్ధికి తోడ్పేందుకు రూపొం దించిన ఎన్నో ఆర్థిక పథకాల్లో ఇదీ ఒకటి. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు.ఈ పథకం విజయ వంతం చేసిన లబ్ధిదారులకు అభినం దనలు తెలిపారు. “సమ్మిళి త ఆర్థికాభివృద్ధి పెంపొందించ డంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యం త ముఖ్యమైంది. ఇది దేశ ప్రజల గౌరవం, సాధికారత, దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేం దుకు ఎంతో ఉపయోగప డింది” అని ప్రత్యేక పోస్టులో ప్రధాని పేర్కొన్నారు.దేశంలో ప్రతి కుటుం బానికి కనీసం ఒక్క బ్యాంకు (bank) ఖాతా అయినా ఉండేటట్లు చూడటం జన్తన్ పథకం ప్రధాన లక్ష్యం. “మీలో చాలా మంది ముఖ్యంగా యువత.. ఈ పథకం ఎందుకు అంత ముఖ్యమైందని ఆలోచిస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండడం ఎంతో ముఖ్యం. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు దాదాపు ఎన్నో సామాన్య కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. దీని వల్ల సామాన్యుల సొత్తు చోరీ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఆర్థిక భద్రత లేకపోవడంతో ప్రజల ఆశలు కలలుగా మిగిలేవి” అని అన్నారు.

“జన్తధన్ యోజన ప్రారంభించినప్పుడు.. దాని చుట్టూ ఉండే సమస్యలు, సందేహాలు (Problems and doubts) నాకు ఇంకా గుర్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.కానీ, ఈ ప్రయత్నం మంచి మార్పుకు దారితీస్తుందని నమ్మాను. 53 కోట్ల మందికి పైగాప్రజలు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఇది ఊహించని పరిణామం. ప్రస్తుతం ఈ ఖాతాల్లో డిపాజిట్ల బ్యాలెన్సు రూ.2.3 లక్షల కోట్లు. వీటిలో 65 శాతానికి పైగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారు ఉండడం విశేషం. అంతేకాకుండా ఈ పథకం ద్వారా మహిళా సాధికారతను సాధించాం. దాదాపు30 కోట్ల మందికి పైగా మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాగలిగాం” అని ప్రధాని (pm)పేర్కొన్నారు.