–ఎంజియూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి
Alwala Ravi: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ (Gandhi University Sports Board)ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ము ఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ ఆచా ర్య ఆలువాల రవి (Alwala Ravi), ఓ ఎస్ డి ఆచా ర్య కొప్పుల అంజిరెడ్డి హాజరై విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసం గించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడు తూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ధారుఢ్యాన్ని చురుకుద నాన్ని , సామాజిక జీవనానికి తోడ్ప డడంతో పాటు ప్రపంచ వేదికలపై నిలబట్టగలిగే అద్భుత రంగంగా అభివర్ణించారు.
ధ్యాన్చంద్ (Dhyan Chand)జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకమని వారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అవమానాలను సైతం భరిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో అధునాతన క్రీడా ప్రాంగణాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు, స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో అంతర కళాశా లల అంతర విశ్వవిద్యాలయాల పోటీలతోపాటు, ఆసక్తి గల విద్యా ర్థులకు ట్రైనింగ్ లు సైతం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ ఉన్నత లక్ష్యాలను చేరు కోవాలని సూచించారు. ఈ సంద ర్భంగా స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ (Sports Board Director)డా హరీష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది జరగబోవు అంతర కళా శాలల మరియు అంతర విశ్వ విద్యాలయ క్రీడ పోటీలకు సమా యత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ అధ్యా పకులు డా మురళి, డా శ్రీనివా సరెడ్డి తదితర విద్యార్థులు పాల్గొ న్నారు.