Bodrai Anniversary: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం లో గల నాభిశిల (బొడ్రాయి) ప్రధమ వార్షికోత్సవం (Bodrai Anniversary) శనివారం కనుల పండువగ నిర్వహించారు శనివారం తెల్లవారుజాము నుండే మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పెద్ద ఎత్తున జలాభిషేకాలు జరిపి మోక్కులను చెల్లించుకున్నారు.భక్తులు (deovtess)కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షంతో (Mother’s compassion) ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, బొడ్రాయి కమిటీ అధ్యక్షులు హరికృష్ణ రెడ్డి లు అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంకా నాగేశ్వరరావు,చిత్తలూరి రజినీకాంత్,కందుల వెంకట నరసయ్య,దాచేపల్లి నరేష్, కుర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.