Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mayor Vijayalaxmi : గణేష్ నిమజ్జనానికి చెరువులను సిద్ధం చేయాలి

— హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
–సఫిల్ గూడ చెరువును పరిశీలిం చిన మేయర్
–గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికా రులకు సూచనలు

Mayor Vijayalaxmi : ప్రజా దీవెన, హైదరాబాద్: గణేష  నిమజ్జనానికి అవసరమైన అన్ని వసతులతో  సఫిల్ గూడ చెరువు ను సిద్ధం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Vijayalaxmi ) సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్ జోన్  సఫిల్ గూడ మినీ ట్యాంక్ ను పరిశీలించారు. శానిటేషన్ పరిస్థితి, రోడ్ల స్థితిగతులను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయా అధికారులకు గణేష నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 7 నుండి 17 వరకు గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని, గణేష్ నిమజ్జనానికి (Ganesh immersion) సఫీల్ గూడ చెరువు వద్ద అవసరమైన  ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని శానిటేషన్ అధికారులకు సూచించారు.

డార్క్ స్పాట్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైటింగ్, పోలీస్ బందోబస్తు (Lighting, police arrangement) ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ర్యాలీ కొనసాగే రహదారులు బాగుండేలా చర్యలు చేపట్టాలని, రోడ్లపై పాట్ హోల్స్ లేకుండా వెంటనే పూడ్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా చెట్టు కొమ్మలను కత్తిరించాలని, చెరువు వద్ద బోట్ ను అందుబాటులో ఉంచాలని, స్ట్రీట్ లైట్స్  వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

భక్తు లకు త్రాగు నీరు, తదితర కనీస సౌకర్యాలు,  కల్పించాలని అధికా రులకు సూచించారు. ఎక్కువ మొత్తంలో మొబైల్ టాయిలెట్స్  ఏర్పాటు చేయాలని, నిమజ్జన సమయంలో  సంబంధిత సర్కిళ్లలో 24 గంటలు పనిచేసేలా  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సంద ర్భంగా ఆయా శాఖల అధికారులు  ఇప్పటివరకు పూర్తి చేసిన పనుల ను మేయర్ కు వివరించా రు. జిహెచ్ఎంసి (ghmc)ప్రధాన కార్యాల యం లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఉత్సవ కమిటీ మే యర్ దృష్టికి  తీసుకు వచ్చిన  ఆయా సమస్యలను పరిష్కరిం చడంలో ప్రత్యేక చొరవ చూపి నందుకు  ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ మేయర్ కు ధన్య వాదాలు తెలి పారు. ఈ తనిఖీలో  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తో (Mayor Vijayalaxmi ) పాటు జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ రాజు, పోలీస్, శానిటే షన్, లేక్స్, ఎంట మాలజీ, వైద్య ఆరోగ్యశాఖ, ఇంజ నీరింగ్, తదిత ర విభాగాల అధికారులు,  కార్పొ రేటర్ శ్రావణ్, గణేష్ ఉత్సవ కమి టీ  సభ్యులు తదితరులు పాల్గొ న్నారు.